Switch to English

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు రెండిటినీ బ్యాలెన్స్ చేయగలడు..’ అని పలు సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి చెబుతూ వచ్చారు.

‘మా దారులు వేర్వేరు కావొచ్చు.. ప్రజా సేవలో మా అంతిమ లక్ష్యం మాత్రమే ఒకటే..’ అని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పిన చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ‘జై’ కొట్టారు తాజాగా.

ఎన్నికల సమయంలో కూడా జనసేన పార్టీకి చిరంజీవి ‘జై’ కొట్టలేదు. కాకపోతే, తమ్ముడు రాజకీయంగా ఎదగాలనీ, ప్రజాసేవలో తనదైన ప్రత్యేకతను చాటుకోవాలనీ చిరంజీవి ఆకాంక్షిస్తూ ఎన్నికల సమయంలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అంతే కాదు, జనసేన పార్టీకి సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. అది కూడా, కౌలు రైతుల కోసం జనసేన చేస్తున్న సాయానికి ఉపయోగపడుతుందన్న కోణంలో.

తాజాగా ఓ సినీ వేడుకలో, ‘ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతం చెందింది..’ అని చిరంజీవి చేసిన ప్రకటన ఒక్కసారిగా తెలుగునాట రాజకీయాల్లో సంచలనంగా మారింది. మెగాభిమానులంతా ఇదే భావనతో మొదటి నుంచీ వున్నా, చిరంజీవి నోటి నుంచి వచ్చిన ఈ ప్రకటన సహజంగానే, రాజకీయ వర్గాల్లో పెను సంచలనానికి కారణమైంది.

‘చిరంజీవి ఎందుకు తన తమ్ముడి పార్టీ జనసేనని ఓన్ చేసుకోవడంలేదు.?’ అంటూ, జనసేన పార్టీ మీద కొందరు సెటైర్లు వేస్తూ వచ్చారు. అన్నయ్య పేరు చెప్పుకోవడానికి ఎందుకంత నామోషీ.. అని అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకులూ వున్నారు.

అయితే అటు పవన్ కళ్యాణ్, ఇటు చిరంజీవి.. ఇద్దరూ ఇప్పటిదాకా వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే వచ్చారు.. ప్రత్యర్తుల విమర్శలకు సంబంధించి. తమ్ముడికి అన్నయ్య ఆశీస్సులు, అన్నయ్య పట్ల తమ్ముడికి వున్న ప్రేమాభిమానాలు.. ఇవన్నీ ప్రతిసారీ చాటుకోవాల్సిన అవసరమే లేదు.

ఏదిఏమైనా, చిరంజీవి ప్రకటన.. నిజంగానే చాలా చాలా పెద్ద స్టేట్మెంట్.. అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సినిమా

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..!

చట్టాలు ఎన్నొచ్చినా.. ఎన్ని రకాల శిక్షలు ప్రవేశ పెట్టినా.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మహిళా సంరక్షణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఒకచోట.. ఏదో ఒకరంగా వాళ్లని హింసిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా...

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 20 మార్చి 2025

పంచాంగం తేదీ 20-03-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ షష్ఠి రా. 10.36 వరకు,...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఇండియన్‌ సినిమా క్వీన్‌ రష్మిక

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న 'ఛావా' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యేసుబాయి పాత్రలో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఛావా సినిమా సూపర్ హిట్ కావడంతో...