Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తుఫాను హోరులో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

సినిమాల్లో రెగ్యులర్ గా చేసే మాస్, క్లాస్, ఫ్యామిలీ, లవ్, హార్రర్, యాక్షన్, భక్తి, సంగీతం.. సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్టులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కొన్నిసార్లు సక్సెస్ అయితే.. మరికొన్నిసార్లు ప్రయోగాలుగా మిగిలిపోతాయి. ఆ తరహాలో మెగాస్టార్ చిరంజీవి తన అప్రతిహత క్రేజ్ జత చేసి చేసిన సినిమా తిరుగులేని ఇండస్ట్రీ హిట్ గా మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఆ సినిమానే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. ప్రేక్షకులను కొత్త లోకంలో విహరించేలా చేసిన ఈ సినిమా తెలుగు సినిమాల్లో ఒక అద్భుతం. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిరంజీవి కెరీర్లో ఓ మేలిమి బంగారంలా.. శ్రీదేవి సిగలో ఓ మణిమకుటంలా నిలిచిపోయింది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తుఫాను హోరులో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’

భారీ హంగులతో అద్భుతం..

కథలోని భారీతనానికి తగ్గ స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం, కళ.. అద్భుతమైన టెక్నీషియన్స్ తోడైతే దక్కే అపురూప విజయమే ఈ సినిమాకు దక్కింది. అప్పటివరకూ ఉన్న ఫాంటసీ కథలకు భిన్నంగా చిరంజీవి సూచన మేరకు ఓ దేవకన్య భూమి మీదకు వచ్చేలా కథ డిజైన్ చేయమని చెప్పడంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇంతటి భారీ స్కేల్ సినిమా బాధ్యతను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపై పెట్టారు చిరంజీవి. సాక్షాత్తూ దేవకన్యే దివి నుంచి దిగివచ్చిన్నట్టు హీరోయిన్ శ్రీదేవి మరిపించారు. అమ్రీష్ పూరి విలనిజం సినిమా గ్రాండియర్ పెంచింది. ఇళయరాజా సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం. అబ్బనీ తియ్యనీ దెబ్బ పాటకు తెరపై డబ్బులే విసిరారు. మానస సరోవరం సెట్ వేసి ప్రేక్షకులు నిజంగా అక్కడికి వెళ్లామనే అనుభూతి కల్పించారు. అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం అద్భుతం.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తుఫాను హోరులో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’

చిరంజీవి కోసం ఓసారి.. శ్రీదవి కోసం మరోసారి..

దర్శకుడు రాఘవేంద్రరావు తన మాయాజాలంతో సినిమాను క్లాసిక్ చేశారు. జంధ్యాల రాసిన ‘మానవా.. అని శ్రీదేవి.. ఆ పిలుపు మానవా..’ అని చిరంజీవి డైలాగులు అలరించాయి. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా చిరంజీవికి వరుసగా నాలుగో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సినిమా రిలీజైనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భీకర తుఫాను అల్లకల్లోలం చేస్తోంది. రెండు రోజులు సినిమా ఆపేసినా ఐదో రోజు నుంచి ధియేటర్ల వద్ద క్యూలు పెరిగిపోయాయి. తుఫానులో కూడా కలెక్షన్ల తుఫాను సృష్టించిన సినిమాగా నిలిచింది. 46 కేంద్రాల్లో 100, విజయవాడ అప్సర ధియేటర్లో 200, షిఫ్టులతో 365 రోజులు ఆడింది. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో అనిల్ కపూర్ ముఖ్య అతిధిగా శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. చిరంజీవి కోసం ఓసారి, శ్రీదేవి కోసం ఓసారి.. సినిమా కోసం మరోసారి చూడాలనే ప్రశంస మర్చిపోలేనిదని కె.రాఘవేంద్రరావు పేర్కొనడం విశేషం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...