ఇటీవలి కాలంలో హైద్రాబాద్ జంట నగరాల్లో రక్త నిధుల కొరత ఏర్పడి.. పేద రోగులు రక్తం దొరకక పలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మెగాభిమానులు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. దీనిలో భాగంగా.. ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నందు.. ఇటీవల మెగా అభిమానులు 3 సార్లు రక్త దాన శిబిరాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.
ప్రస్తుతం 4 వ శిబిరం గా.. జి.వి. దుర్గారావు ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్రదర్స్ అసోసియేన్ స్వచ్చంద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ న హైదరాబాద్ లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగనుంది. తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపుతో 25 ఏళ్లుగా రక్తదానం చేస్తూ మెగా అభిమానులు అనేక బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
‘చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నిత్యం రక్తం అందుబాటులో ఉండాలి.. పేదలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం” అని అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి నాయుడు తెలియజేసారు. ఈ శిబిరాలలో మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి కొన్ని ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాం అని అన్నారు.
585835 74086Glad to be 1 of a lot of visitants on this awesome web site : D. 635774
148913 225478Thanks for all your efforts that you have put in this. very interesting info. 566329