కరోనాని కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తమ వంతుగా చేయాల్సినదంతా చేస్తున్నారు. ప్రభుత్వానికి అండగా ఉండడం కోసం, ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు తమకు తోచిన విధంగా డబ్బు రూపేణా, వస్తువులు రూపేణా సహాయం చేసిన విషయం తెల్సిందే. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ అని మరొకటి నిధిని తయారుచేసి ఇండస్ట్రీలో రోజు కూలీకి అండగా నిలబడ్డారు. ఇక ప్రజలలో చైతన్యం కలిగించడం కోసం ప్రతీ సెలెబ్రిటీ తమకు తోచిన రీతిలో కార్యక్రమాలు చేస్తున్న విషయం తెల్సిందే.
చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఒక వీడియో సాంగ్ లో నటించిన విషయం తెల్సిందే. ఇక ఇండియన్ ఇండస్ట్రీలోని వివిధ సెలెబ్రిటీలు అందరూ ఎవరింట్లో వారు ఉండి చేసిన చిన్న వీడియో కూడా భలేగా వర్కౌట్ అయింది. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్లకార్డులను పట్టుకుని సందేశాన్ని ఇచ్చారు. “ఇంట్లో యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భారత్ ను గెలిపిస్తాం” అన్న సందేశాన్ని మెగా ఫామిలీకు చెందిన చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, శ్రీజ, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్ వంటి వారు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించారు.
మెగా ఫ్యామిలీ మొత్తం కలిసొచ్చి చేసిన ప్రయత్నం కాబట్టి కచ్చితంగా ప్రజలలో అవగాహన పెరగడం ఖాయం.
82518 74497Ill create a hyperlink towards the internet page about my private weblog. 637581
172456 90954Spot lets start function on this write-up, I truly believe this amazing website requirements a lot a lot more consideration. Ill apt to be once once more to read an excellent deal a lot more, a lot of thanks for that info. 108854
702378 987505very nice post, i certainly enjoy this wonderful website, persist with it 512894
25131 3466Most what i read online is trash and copy paste but i feel you offer something different. Maintain it like this. 139014