పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్ షాపులో చోటుచేసుకున్న సిలిండర్ పేలుడు తీవ్రమైన విషాదానికి దారితీసింది. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినట్టు కొన్ని సెకన్లలోనే దుకాణం మొత్తం ధ్వంసమైపోయింది. పేలుడు శక్తి అంతగా ఉండటంతో శకలాలు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపోయాయి. ఆ సమయంలో షాపు ముందు కారు పార్క్ చేసి నిల్చున్న డ్రైవర్ పేలుడు దాటికి అక్కడికడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనలో గోమతి ఎలక్ట్రానిక్ షాపు ఓనర్ అగర్వాల్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, చికిత్స ఫలించక మరుసటి రోజు ఆయన మృతి చెందాడు. మరో గాయపడిన వ్యక్తి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కుటుంబాలను, ప్రాంతాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.
ఫ్రీజ్లు, ఏసీల్లో ఉన్న కంప్రెసర్ల పేలుడు కూడా ఈ ప్రమాద తీవ్రతను మరింత పెంచిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పేలుడు ఖచ్చితమైన కారణాలను పరిశీలిస్తున్నారు. భద్రతా ప్రమాణాలపై మరింత జాగ్రత్తలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
