బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ కంటెస్టెంట్గా నిలుస్తారని భావించిన మర్యాద మనీష్ అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో షోపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆయన ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో, “బిగ్ బాస్ షో నిజంగానే రియాలిటీనా? లేక స్క్రిప్ట్ ప్రకారమా?” అనే ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
మనీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “బిగ్ బాస్ అసలు స్క్రిప్టెడ్ షో కాదు. ఇది 100% జెన్యూన్ రియాలిటీ షో” అని తెలిపారు. ఆయన చెప్పిన మాటల్లో, “మేము హౌస్లోకి వెళ్లిన తర్వాత బయట ప్రపంచంతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. ఎవరికీ ఏమి చెప్పరు. ఎవరి మీద గొడవపడాలో, ఎవరితో ఫ్రెండ్ కావాలో అన్నీ మేమే నిర్ణయించుకుంటాం. ప్రతి రియాక్షన్ కూడా సహజంగానే వస్తుంది” అని వివరించారు.
అలాగే ఆయన మరో విషయం చెప్పాడు — “స్టోర్ రూమ్ నుంచి కొన్ని లెటర్స్ లేదా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అవి కేవలం టాస్క్ రూల్స్కి సంబంధించినవే. ఉదాహరణకు, ‘ఈరోజు టాస్క్ బ్రేక్ చేయొద్దు’ లేదా ‘రూల్స్ పాటించండి’ అనే మెసేజ్లు మాత్రమే వస్తాయి. కానీ స్క్రిప్ట్ లేదా డైరెక్షన్ లాంటి విషయం అసలు ఉండదు” అని మనీష్ క్లారిటీ ఇచ్చారు.
మనీష్ మాట్లాడుతూ, “హౌస్లో ఉన్నవాళ్లందరూ తమ స్మార్ట్ వ్యూహాలతో ఆడతారు. ఎవరు ఎవరితో కలుస్తారో, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటారో అన్నీ పూర్తిగా వారి గేమ్ ప్లాన్పైనే ఆధారపడి ఉంటుంది. మేకర్స్ దీనిలో జోక్యం చేసుకోరు” అని తెలిపారు.
ప్రస్తుతం మర్యాద మనీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో స్క్రిప్ట్ ప్రకారమా? అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్కు ఫుల్ క్లారిటీ ఇచ్చిందనే చెప్పాలి.
బిగ్ బాస్ ఇంట్లో రెండు వారాలు ఉన్న మర్యాద మనీష్ రూ. 1.40 లక్షల పారితోషికం అందుకున్నారు. అంటే రోజుకి ₹10,000 చొప్పున, వారానికి ₹70,000గా ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
