గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందబోతున్న పక్కా కమర్షియల్ మూవీ కరోనా కారణంగా ఆలస్యం అవుతోంది. అక్టోబర్ లో సినిమా ను విడుదల చేయాలని భావించారు. కాని కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో మారుతి తన స్క్రిప్ట్ వర్క్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మారుతి ఇప్పటికే రెడీ చేసిన స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడం కోసం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పక్కా కమర్షియల్ సినిమా ను మొదలు పెట్టే సమయానికి మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాడు.
మారుతి గత సినిమా లు మంచి విజయాలను దక్కించుకున్నాయి. దాంతో ఈ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండేలా మారుతి స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందబోతున్న పక్కా కమర్షియల్ సినిమా లో గోపీచంద్ పాత్ర అత్యంత విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో సినిమా లో గోపీ చంద్ కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్ర ను చేస్తాడని అంటున్నారు. గోపీ చంద్ మరీ నెగటివ్ గా కనిపించడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉందని అందుకే పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ ను మార్చుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
555505 410822Thank you a lot for giving every person an extraordinarily particular possiblity to check ideas from here. 607992