మన్సాస్ ట్రస్టు వ్యవహారంలో అధికార వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుని తొలగించి, మన్సాస్ ట్రస్టు బాధ్యతలతోపాటు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బాధ్యతల్నీ సంచైతకు వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టిన విషయం విదితమే.
అయితే, ఆ నియామకాలు చెల్లవని హైకోర్టు తేల్చి చెప్పడంతోపాటు, ప్రభుత్వం సంచయిత విషయమై జారీ చేసిన జీవోల్ని కొట్టి పారేసింది. దాంతో, ఇప్పుడు అధికార పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యింది. 14 వేల ఎకరాల భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ కొత్త పల్లవి అందుకుంది అధికార వైసీపీ, మన్సాస్ ట్రస్టు వ్యవహారంపై.
వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, గడచిన పదేళ్ళలో టీడీపీ నేత హయాంలో మన్సాస్ ట్రస్టులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు తాజాగా. ఏడాది కాలంగా మన్సాస్ ట్రస్టు వైసీపీ కనుసన్నల్లోనే నడిచాయి.. ఔను, సంచైతకు కీలక బాధ్యతల్ని వైసీపీ అప్పగించింది గనుక.. అందులో అంతకు ముందు అక్రమాలేవైనా జరిగి వుంటే, వైసీపీ ప్రభుత్వం ఈపాటికి ఆధారాలతో సహా బయటపెట్టే వుండేది. ఏడాది కాలం ఆ వ్యవహారాలపై పెదవి విప్పకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
ట్రస్టుకి సంబంధించిన భూములు చేజారిపోయాయని వైసీపీ బాధపడుతోందా.? అన్న చర్చ ఇప్పుడు ఉత్తరాంధ్రలో గట్టిగా వినిపిస్తోంది. నిజానికి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు కంటే ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రజానీకం మన్సాస్ వ్యవహారంపై గుస్సా అయ్యారు. సంచైతకు ట్రస్టు బాధ్యతల్ని అప్పగించడాన్ని ఉత్తరాంధ్ర ప్రజానీకమే తప్పు పట్టారు. సంచైత బీజేపీ నేత అయినా, ఆమెను బీజేపీ సైతం ఈ విషయంలో తప్పు పట్టడం గమనార్హం.
ఏదిఏమైనా మన్సాస్ ట్రస్టు విషయంలో అధికార వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శించి బొక్కబోర్లా పడాల్సి వచ్చింది. అశోక్ గజపతిరాజు న్యాయపోరాటం పలించడంతో వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి అయ్యిందిప్పుడు మన్సాస్ వ్యవహారానికి సంబంధించి. దాంతో, డ్యామేజీ కంట్రోల్ కోసం వైసీపీ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నట్లే కనిపిస్తోంది.
536096 762637Which is some inspirational stuff. Never knew that opinions may well be this varied. Thank you for all the enthusiasm to offer such valuable info here. 147997
792822 595311Glad to be one of many visitants on this awing internet web site : D. 92030