కరోనా అందరిని ఇబ్బందులకు గురి చేస్తోంది. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు కోటీశ్వరుల నుండి కూటికి లేని వారి వరకు అందరిని కూడా అతలాకుతలం చేస్తూ జీవితాలతో ఆడుకుంటూ ఉంది. ఎంతో మంది కన్నీరుకు కారణం అవుతోంది. కరోనా మంచు విష్ణుపై కూడా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుందట. ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో మంచు విష్ణు ఒక్కడే హైదరాబాద్లో ఉండగా ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అమెరికాలో ఉన్నారట.
కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి అనారోగ్యంగా ఉండటంతో అమెరికాలో ఆపరేషన్ కోసం వెళ్లారట. దేవుడి దయవల్ల ఆపరేషన్ బాగా అయ్యిందని చెప్పిన మంచు విష్ణు ఆ తర్వాత తల్లి దండ్రితో కలిసి ఇండియా వచ్చాడు. మూడు నాలుగు రోజుల తర్వాత పిల్లలు రావాల్సి ఉండగా విమాన సర్వీసులు పూర్తిగా నిలిపేసినట్లుగా ఆయన చెప్పాడు. పిల్లులు పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుండగా ఎప్పుడు కూడా వారిని ఇలా విడిచి దూరంగా ఉండలేదని మంచు విష్ణు ఎమోషనల్ అయ్యాడు.
పిల్లలకు దూరంగా ఉండటం చాలా ఇబ్బందిగా ఉందని.. లాక్ డౌన్ ఏప్రిల్ 14 తర్వాత ముగిస్తుందని ఆశిస్తున్నాను. ఆ తర్వాత పిల్లలు తిరిగి వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక సోషల్ డిటెన్షన్ పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సమయం ప్రతి ఒక్కరికి కూడా చాలా కీలకం అన్నాడు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహిస్తూ కరోనా వైరస్ మహమ్మారితో పోరాడాలన్నాడు. మంచు విష్ణు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాపం పిల్లలకు దూరంగా ఉంటున్న మంచు విష్ణు ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో కదా.. ఇలాంటి వారు ఇంకా ఎంతమందో అంటూ మరికొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు.
596736 14760Thank you for having the time to discuss this subject. I truly appreciate it. Ill stick a link of this entry in my internet site. 870458
86666 887306This is a great topic to speak about. Generally when I uncover stuff like this I stumble it. This article probably wont do well with that crowd. I will likely be confident to submit something else though. 832649
234192 188464Yay google is my king helped me to uncover this wonderful website ! . 251137