మంచు ఫ్యామిలీలో గొడవలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మనోజ్ మరోసారి విష్ణుపై సెటైర్లు వేశాడు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ భైరవం.
తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏలూరులో నిర్వహించారు. ఈవెంట్ లో మనోజ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఈ రోజుల్లో నా కుటుంబమే నన్ను నడిరోడ్డుపై కట్టుబట్టలతో నిలబెట్టింది. నా కార్లు లాగేసుకుంటే నా ఫ్యాన్స్ నాకు అండగా ఉన్నారు. 20 కార్లు తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టారు. వారందరికీ ఆ జన్మాంతం రుణపడి ఉంటాను.
శివయ్యా అని పిలిస్తే శివుడు రాడు. శివుడు మనుషుల రూపంలో వస్తాడు. నాకు ఆపద వచ్చినప్పుడు నా ఫ్యాన్స్ రూపంలో, సినిమా ఛాన్స్ ఇవ్వడానికి మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ల రూపంలో వచ్చాడు. నా తండ్రి నాకు క్రమశిక్షణ నేర్పించాడు. ఆయన నేర్పించిన క్రమశిక్షణతోనే ముందుకు వెళ్తున్నాను. అదే నన్ను పోరాడే విధంగా చేస్తోంది. ఏడేళ్ల తర్వాత సినిమాతో ముందుకు వస్తున్నాను. ఇన్నేళ్లు అయినా నా ఫ్యాన్స్ నన్ను ఆదరిస్తున్నారు. ఇంతకంటే నాకేం కావాలి. మంచి సినిమాలు చేయాలని ఉంది. వాటి కోసమే ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను పడిన బాధను అంతా మర్చిపోవడానికి మీ సపోర్ట్ కావాలి’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్.
