సినిమా ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుందని.. హీరోయిన్లకు అసలు గుర్తింపు ఇవ్వట్లేదని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు వాపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మాళవిక మోహనన్ కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. మాళవిక మళయాల ఇండస్ట్రీతో ఎంట్రీ ఇచ్చి చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రజినీకాంత్ నటించిన పేట సినిమాతో ఆమెకు ఎనలేని గుర్తింపు లభించింది. ఈ మూవీ పెద్ద హిట్ కావడంతో ఒక్కసారిగా సౌత్ ఇండియాలో ఆమెకు అవకాశాలు రావడం పెరిగాయి. కాకపోతే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా అవకాశాలు కూడా లేవు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ మీద సంచలన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఒక సినిమా క్రెడిట్ ఏదైనా సరే అది హీరోలకే ఎక్కువగా దక్కుతోంది. ఒక మూవీ కలెక్షన్ల పరంగా, విమర్శల పరంగా పెద్ద హిట్ అయితే మాత్రం అది కచ్చితంగా హీరోలకే వెళ్తోంది. అంతే తప్ప హీరోయిన్ల పేరు నామ మాత్రంగా కూడా వినిపించట్లేదు. ఇప్పుడు వస్తున్న సినిమాలు మొత్తం హీరోలను బేస్ చేసుకునే వస్తున్నాయి. అందులో హీరోయిన్ల పాత్ర పది నిముషాల లోపే ఉంటుంది.
కేవలం గ్లామర్ కోసమే అన్నట్టు భావిస్తున్నారు. కానీ హీరోయిన్లకు మంచి పాత్రలు వస్తే అద్భుతంగా నటిస్తారు. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను అంటూ మాళవిక సంచలన కామెంట్లు చేసింది. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.