Switch to English

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,801FansLike
57,764FollowersFollow

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన అభిమానుల్ని ఉద్దేశించి వారిస్తూ వచ్చేవారు. ఒక్కోసారి కోపంగా కూడా చెప్పారు.

‘మీరు తిట్టండి.. కానీ, మేం ఓజీ అని అరుస్తూనే వుంటాం. అది మీ మీద మా అభిమానం..’ అని సోషల్ మీడియాలో ట్వీట్లు వేసి మరీ, జనసైనికులు పిఠాపురం – చిత్రాడలో జనసేన నిర్వహించిన ‘జయకేతనం’ బహిరంగ సభకు వెల్ళారు.. అధినేత పవన్ కళ్యాణ్ ముందరే ‘ఓజీ ఓజీ’ అంటూ నినాదాలు చేశారు.

అయితే, ఈసారి పవన్ కళ్యాణ్, తన అభిమానుల్ని కాస్త డిఫరెంట్‌గా డీల్ చేశారు. ‘మీరు ఇక్కడ ఇలాంటి నినాదాలు ఎందుకు చేయకూడదో తెలుసా.? జనసేన సిద్ధాంతాల కోసం దాదాపు 450 మంది జనసైనికులు ప్రాణ త్యాగాలు చేశారు. వారికి మనం ఇలాంటి వేదికల్లో గౌరవం ఇవ్వాలి..’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

దాంతో, ఒక్కసారిగా వేదిక అంతా ‘పిన్ డ్రాప్ సైలెంట్’ అయిపోయింది. ఇక, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి మాటనీ, జనసైనికులు చాలా చాలా శ్రద్ధగా వింటూ వచ్చారు. ‘సీఎం పవన్ కళ్యాణ్’ అనే నినాదాలు అక్కడక్కడా వినిపించినా.. వాటి శబ్దం కూడా చాలా తక్కువే వుంది.

సాధారణంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ఒకింత ‘ఆవేశం’ ఎక్కువగా వుంటుంది. ఆవేదనలోంచి పుట్టే ఆవేశం అది. వేదిక మీదకు వస్తూనే, హై ఓల్టేజ్ పవర్‌తో పవన్ కళ్యాణ్ కనిపించారు. ఆ తర్వాత ప్రసంగం ప్రారంభించాక కూడా కొన్ని సెకెన్ల పాటు ఆ హై ఓల్టేజ్ ఎనర్జీని, తన ప్రసంగంలో చూపించారు. అంతే, ఆ తర్వాత ప్రసంగం పూర్తిగా కొత్త టర్న్ తీసుకుంది.

బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రస్తావన, గోద్రా అల్లర్ల వ్యవహారం, సనాతన ధర్మం, హిందువుల – క్రిస్టియన్ల గురించిన ప్రస్తావన.. ఇలా కీలక అంశాల గురించి జనసేనాని మాట్లాడుతోంటే, జనసైనికులు చెవులు రిక్కించి విన్నారు. ఎక్కడా ఎలాంటి ‘నాయిస్’ లేకుండా పోయింది.

అలాగని, మొత్తం ప్రసంగం సీరియస్ టోన్‌లోనే సాగిందనుకుంటే అది పొరపాటే. సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా పవన్ కళ్యాణ్ తన మీద తాను కూడా ఒకట్రెండు సెటైర్లు వేసుకున్నారు. అప్పుడు, సభా ప్రాంగణమంతా నవ్వులతో నిండిపోయింది. ఆ తర్వాత మల్ళీ వెంటనే, సీరియస్ టోన్.

పారిశుధ్య కార్మికులకు థ్యాంక్స్ చెప్పడం దగ్గర్నుంచి, వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ పని చేసిన తీరు దగ్గర వరకు, అలాగే నా కానిస్టేబుల్ సోదరులకు.. అని పవన్ కళ్యాణ్ పేర్కొన్న తీరు.. వాట్ నాట్.. అన్నీ చాలా చాలా ప్రత్యేకమే.

ప్రతి మాటా క్షుణ్ణంగా వినండి, అర్థం చేసుకోండి.. అంటూ, శ్రీశ్రీ సహా గుంటూరు శేషేంద్ర శర్మ తదితర కవుల ప్రస్తావన, వారు చెప్పిన మంచి మాటల్ని చెబుతూ ప్రసంగాన్ని పరుగులు పెట్టించారు జనసేనాని పవన్ కళ్యాణ్.

ఇప్పటిదాకా ఎన్నో బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఉర్రూతలూగించి వుండొచ్చు. ఈసారి మాత్రం, ఉర్రూతలూగిస్తూనే మరింతగా ఆలోచింపజేసేలా ప్రసంగించారు.

ఆయన ఆలోచింపజేసే ప్రసంగం చేయడం ఓ యెత్తు అయితే, దాన్ని ఆసాంతం, ఆసక్తిగా విని, జనసైనికులు అర్థం చేసుకోవడం, అధినేత ఆలోచనలకు తగ్గట్టుగా తమ ఆలోచనల్ని జనసైనికులు మార్చుకోవడం ఇంకో యెత్తు. ఇది జయకేతనం సాక్షిగా కనిపించిన అతి పెద్ద మార్పు.

సినిమా

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

Samantha: నెట్టింట ఓ పోస్టు.. లైక్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో చర్చ

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తన వృత్తి, ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, పర్యటనలు, మహిళల రక్షణ.. వంటి అంశాలపై స్పందిస్తూంటారు. ఈక్రమంలో ఇంటర్నెట్లో వైవాహిక జీవితాలు విచ్ఛిన్నం అనే అంశంపై...

సమ్మర్ హీట్ పెంచే గ్లామర్ ట్రీట్..!

మద్రాసి సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ వేదిక. 2006 లోనే తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఇప్పటికీ కెరీర్ కొనసాగిస్తుంది. 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన విజయదశమి సినిమాతో తెలుగు తెరకు...

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కష్టమేనా..?

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం...

అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే మా బాధ తెలిసేది : జాన్వీకపూర్

జాన్వీకపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సౌత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇక సినిమాల్లో ఎలా ఉన్నా.. బయట మాత్రం అమ్మడు మంచి...