సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా లేటెస్ట్ గా చేసిన సరిలేరు నీకెవ్వరూ సినిమా సక్సెస్ తరువాత నెక్స్ట్ సినిమా వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఓకే చెప్పాడు. అయితే ఆ సినిమా విషయంలో దర్శకుడు అప్పుడే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసాడు.
అయితే ఎవరు ఊహించని విధంగా ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టు జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ఎందుకు ఆగిపోయింది అన్న విషయం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్క్రిప్ట్ విషయంలో మహేష్ సంతృప్తిగా లేకపోవడంతోనే ఈ సినిమాను ఆపేసాడని అంటున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో అసలు విషయం వేరేగా ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఏమిటంటే వంశీ పైడిపల్లి నెక్స్ట్ ఇంతకు ముందు మహేష్ తో చేసిన మహర్షి సినిమా విషయంలో పలు సమస్యలు ఉన్నాయి. మహర్షి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు, అటు నిర్మాతలకు లాభాలు రాలేదు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాగా డిస్సప్పాయింట్ చేయడంతోనే వంశీ తో మళ్ళీ సినిమా చేస్తే రిస్క్ అని బావించాడో ఏమో .. అందుకే ఈ సినిమాను పక్కన పెట్టినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టడంతో నెక్స్ట్ సినిమా విషయంలో ఇప్పటికే గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
174205 726675I discovered your blog internet site on google and check just a couple of of your early posts. Proceed to maintain up the superb operate. I just extra up your RSS feed to my MSN Information Reader. Seeking forward to reading far more from you in a while! 479879
46579 562895I agree completely with what you said. Fantastic Stuff. Keep it going.. 989558