సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి ఇందిర దేవి మరణం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. మహేష్ బాబు తన తల్లి మరణం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ అంటే తనకున్న అభిమానం ను గతంలో పలు సందర్భాల్లో మహేష్ బాబు తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు.
ఒక సినిమా ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ తన అమ్మని దేవతల భావిస్తాను అన్నాడు. నా సినిమా ఏదైనా విడుదలవుతున్న రోజు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. అక్కడ కాఫీ దేవుడి ప్రసాదంలా భావిస్తాను. ప్రతి సినిమాకు నాకు అదొక సెంటిమెంట్ గా వచ్చింది అంటూ తల్లి పై తనకున్న ప్రేమను చెప్పాడు.
మహేష్ బాబు ఎన్నో ప్రత్యేక సందర్భాల్లో తల్లితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇక తన ఇద్దరు పిల్లలను కూడా సాధ్యమైనంత ఎక్కువ సమయం తన తల్లి వద్ద గడిపే విధంగా ఆయన చూసేవారు. తన కూతురు సితారని తన అమ్మ మాదిరిగా ఉందంటూ అనేక సందర్భాల్లో మహేష్ బాబు చెప్పి ఉన్నాడు.
ఇంకా ఎన్నో సందర్భాల్లో కూడా తన తల్లి యొక్క విశేషాలను పంచుకుంటూ మురిసి పోయేవాడు. చిన్నతనంలో ఆమె కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా కూడా వాటిని ఎదుర్కొని నిల్చుని ఐదుగురు పిల్లలకు బాసటగా నిలిచారు. ప్రతి విషయంలో కూడా ఆమె చాలా ధైర్యంగా నిలుచున్నారంటూ మహేష్ బాబు సన్నిహితులతో చెప్పేవారట.
తల్లి మనం మరణ వార్త తెలియగానే మహేష్ బాబు హుటా హుటిన ఆమె ఇంటి వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ అందరి గుండెలను పిండేస్తున్నాయి. తల్లి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, అభిమానం ఉంటుంది.. మహేష్ బాబుకి ఒకింత ఎక్కువే అమ్మ అంటే గౌరవం ఉంది.. అని ప్రేమ ఉందని ఈ సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం.
576102 706836Wow, cool post. Id like to write like this too – taking time and real effort to make a good article but I procrastinate too significantly and never appear to get started. Thanks though. 523563