ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన విషయం తెల్సిందే. బాహుబలితో వచ్చిన క్రేజ్తో సాహో చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే పలువురు స్టార్స్ తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇటీవలే ఫస్ట్లుక్తో వచ్చిన ‘పుష్ప’ చిత్రంను కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయబోతున్నట్లుగా చెప్పకనే చెబుతూ ఏకంగా అయిదు భాషల్లో పోస్టర్స్ను విడుదల చేయడం జరిగింది.
ఇక ఈ సమయంలోనే మహేష్బాబు కూడా తన కొత్త సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని భావిస్తున్నాడు. కాస్త ఆలస్యం అయినా వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమా తీసుకు వచ్చినా కూడా ఖచ్చితంగా అది దేశం మొత్తం విడుదల అయ్యేలా ఉండాలనేది మహేష్ ప్లాన్గా తెలుస్తోంది. అందుకే అందుకు సరిపడ స్క్రిప్ట్ను చూస్తున్నాడు. ప్రస్తుతం పరశురామ్ ఈయన కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పరశురామ్ సిద్దం చేసిన కథను కాకుండా కొత్త స్క్రిప్ట్పై మహేష్ బాబు దృష్టి పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్బాబు యూనివర్శిల్ సబ్జెట్స్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడట. ఒక్క ప్రాంతం లేదా భాషకు పరిమితం అవ్వకుండా ఉండేలా పాన్ ఇండియా లెవల్లో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆకట్టుకునేలా స్క్రిప్ట్ ఉండేలా మహేష్బాబు ప్లాన్ చేస్తున్నాడు. దాంతో మహేష్ తదుపరి చిత్రం పరశురామ్ దర్శకత్వంలో ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. పరశురామ్ పాన్ ఇండియా స్క్రిప్ట్ సిద్దం చేస్తే ఆయన దర్శకత్వంలోనే చేస్తాడని తెలుస్తోంది. మహేష్ తన 27వ చిత్రంను మొదలు పెట్టేందుకు మరో మూడు నాలుగు నెలలు సమయం అయినా తీసుకునేలా ఉన్నాడు. అప్పటి వరకు ఆయన కోరుకున్న స్క్రిప్ట్ వస్తుందా చూడాలి.
795813 783216some genuinely choice content material on this internet site , saved to my bookmarks . 977081