స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ అందుకొని, ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ కొల్లగొడుదామని సుకుమార్ డైరెక్షన్ లో ప్లాన్ చేసిన సినిమా ‘పుష్ప’. కోవిడ్ పరిస్థితుల వలన షూటింగ్ ఈ ఏడాది చివరికి మొదలయ్యే అవకాశం ఉంది కానీ లాక్ డౌన్ టైంకి రిలీజ్ చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ మాత్రం ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది.
లాక్ డౌన్ టైంలో ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఢీ కొట్టే పవర్ఫుల్ విలన్ పాత్రలో ఎవరు కనిపిస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పటికే సునీల్ శెట్టి, సుధీప్, కౌశల్ ఇలా పలువురి పేర్లు వినిపించినా ఒక్కరూ ఫైనల్ కాలేదు. తాజాగా మాధవన్ పేరు వినిపించింది. కానీ నిశ్శబ్దం ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని మాధవన్ కొట్టిపారేశారు. నేను అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చేయడం లేదని, అలా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు.
మరోవైపు గత 5 నెలలుగా అల్లు అర్జున్ అదే లుక్ లో ఉన్నారు. అలాగే రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో నవంబర్ నుంచి షూట్ మొదలు పెట్టాలని, అది కూడా యాక్షన్ ఎపిసోడ్స్ తో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ముందు అనుకున్నట్టుగానే కేరళ ఫారెస్ట్ లో షూట్ మొదలెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ 5 నెలలు పైనే గ్యాప్ దొరికినా సుకుమార్ కి మాత్రం పర్ఫెక్ట్ విలన్ దొరకట్లేదు. మరి షూటింగ్ మొదలయ్యే టైంకి అయినా విలన్ సెట్ అవుతాడా?
మొత్తం 5 భాషల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పాన్ ఇండియా గుర్తింపు ఉన్న స్టార్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
277805 48740Some truly nice and utilitarian data on this web internet site , likewise I think the design and style holds great capabilities. 411190
165521 608921its great as your other articles : D, regards for posting . 791777