ట్రోల్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోండి.. డీజీపీకి “మా” సభ్యుల వినతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,376FansLike
57,764FollowersFollow

సోషల్ మీడియా వేదికగా సినీ ఆర్టిస్టులపై వస్తున్న ట్రోల్స్, అసభ్యకర ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ( MAA ) సభ్యులు తెలంగాణ డీజీపీ జితేందర్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఇప్పటికే ఐదు యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోగా.. మరో 250 యూట్యూబ్ ఛానళ్ల వివరాలను “మా” సభ్యులు డీజీపీకి అందజేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్ సెక్యూరిటీ వారి సహకారంతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ట్రోల్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని డీజీపీ తెలిపారు.

ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ” సినీ నటులపై మీమ్స్, ట్రోల్స్ శృతిమించి పోతున్నాయి. నవ్వుకునేలా ఏదైనా చేయడానికి అందరికీ స్వతంత్రం ఉంటుంది. కానీ అది మరొకరి మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు. ఈ మధ్యకాలంలో మన సంస్కృతి దిగజారి పోయేలా చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఇది సినీ ఆర్టిస్టులకే కాదు సాధారణ జనాలకు కూడా మంచిది కాదు. ఏదైనా ఒక స్థాయి వరకే తట్టుకోగలం. కుటుంబ సభ్యులను కూడా లాగి విమర్శించడం సరికాదు. ఇకమీదట అలాంటివి సహించేది లేదు” అని అన్నారు.

“మా” కోశాధికారి శివబాలాజీ మాట్లాడుతూ ..” సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల సినీ ఆర్టిస్టులే కాదు కొందరు జర్నలిస్టులు మరికొందరు ప్రముఖులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచిలో కూడా చెడును వెతుకుతూ వెకిలి పోస్టులతో ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మేం కూడా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ విభాగంతో కలిసి పనిచేసి ఇప్పటికే 25 చానళ్లపై చర్యలు తీసుకున్నాం. ఈనెలాఖరిలోపు ఇంకా మిగిలిన యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తాం” అని అన్నారు.

2 COMMENTS

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎక్కువ చదివినవి

మేషం, వృషభం రాశుల వారికి ఉద్యోగ ప్రశంసలు – ఆర్థిక లాభ సూచనలు

మార్చి 4, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో చిన్న ఆనంద వార్త వింటారు. ధన...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

తాతయ్య గుంట అమ్మవారి దర్శనంలో అనన్య నాగళ్ళ

తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి దేవాలయాన్ని ప్రముఖ నటి అనన్య నాగళ్ళ శనివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వకీల్ సాబ్, మల్లేశం, పొట్టేల్, తంత్ర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ...

దుబాయ్‌లో అలర్ట్ పరిస్థితి.. తెలుగు వారితో ఈటెల రాజేందర్ ఫోన్ సంభాషణ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న తెలుగు ప్రజలతో ఈటెల రాజేందర్ ఫోన్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. బాంబుల మోతలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష ఇబ్బందులు...

అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశానికి బలం: నారా లోకేష్

ముంబయిలో జరిగిన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా - 2026’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశాన్ని బలంగా...