కోర్టు కేసుల కోసం కోట్లు ఖర్చైపోతున్నాయ్.! ఎవడబ్బ సొమ్మనీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,301FansLike
57,764FollowersFollow

కోర్టు కేసుల కోసం ప్రభుత్వం వందల కోట్లు వృధా చేస్తోందా.? కేవలం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పర్యావరణ అనుమతుల వివాదానికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనల కోసమే వంద కోట్ల పైన ఖర్చయ్యిందా.? ‘ఇంతమంది లాయర్లు వాదించాల్సిన అవసరమేంటి.? ఎంత ప్రజాధనం దుర్వినియోగమవుతోంది.?’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేయడం అంతటా చర్చనీయాంశమయ్యింది.

కేవలం పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల వివాదం మీదనే 100 కోట్లు ప్రభుత్వం న్యాయవాదుల కోసం ఖర్చు చేస్తోన్నమాటే నిజమైతే, వందలు కాదు.. వేల కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో వున్నాయ్. వాటి కోసం ప్రభుత్వం ఇంకెంతలా ఖర్చు చేస్తోందిట.? ఈ ప్రశ్న సహజంగానే, రాష్ట్ర ప్రజానీకంలో అలజడిని రేకెత్తిస్తోంది.

ప్రత్యేకించి, రాజధాని అమరావతి విషయమై వైఎస్ జగన్ సర్కారు, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో తమ వాదనల్ని బలంగా వినిపించేందుకు ప్రముఖ న్యాయవాదుల్ని నియమిస్తున్న సంగతి తెలిసిందే.

‘అమరావతిలో ఉద్యమిస్తున్నది పేద రైతులు కాదు.. కోట్లు వెచ్చించి లాయర్లను పెట్టుకుంటున్నారు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..’ అని గతంలో వైసీపీ ఆరోపణలు చేయడం చూశాం. పలువురు మంత్రులు కూడా ఇవే ఆరోపణలు చేశారు. మరి, ఆ అమరావతి రైతుల తరఫున వాదిస్తోన్న న్యాయవాదులకు ధీటుగా ప్రభుత్వం కూడా కొందరు ‘ఖరీదైన న్యాయవాదుల్ని’ రంగంలోకి దించింది కదా.? దాని మాటేమిటి.?

హైకోర్టు మొట్టికాయలేసినా, సుప్రీంకోర్టు తలుపు తట్టి.. అక్కడా మొట్టికాయలేయించుకోవడం వైసీపీ సర్కారుకి కొత్తేమీ కాదు. కేసులో నెగ్గలేమని తెలిసీ, న్యాయస్థానాల్ని ప్రభుత్వం ఆశ్రయిస్తున్నది, ప్రజల సొమ్ముని వృధాగా ఖర్చు చేయడం కోసమేనన్న విపక్షాల విమర్శల్లోనూ వాస్తవం లేకపోలేదనిపించడం మామూలే.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం, చంద్రబాబుపైనా, ఆయన తనయుడు లోకేష్ మీదా కేసుల వ్యవహారాలు.. చెప్పుకుంటూ పోతే, మూడొందల కేసులు.. ముప్ఫయ్ మూడు వేల ఆరోపణలు.. అన్నట్లు తయారైంది పరిస్థితి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, ఎన్ని వందల కోట్లు.. ఎన్ని వేల కోట్లు కోర్టు ఖర్చుల కోసం అధికారపక్షం వృధా చేస్తోందబ్బా.? అన్న డౌటానుమానం ప్రజల్లో కలగడం సహజమే కదా.!

‘ఎంత సొమ్ము వృధా చేస్తున్నారో లెక్కలు తేల్చాలని ఆదేశాలిస్తాం..’ అని సుప్రీంకోర్టు హెచ్చరించే స్థాయికి వచ్చిందంటే, పరిస్థితి తీవ్రంగా వుందన్నమాట. హెచ్చరించడం కాదు, ఆ ఆదేశాలు ఏవో ఇచ్చేస్తే, ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తోందో ప్రజలకీ ఓ ఐడియా వస్తుంది.

5 COMMENTS

సినిమా

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

రాజకీయం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

ఎక్కువ చదివినవి

భావ రస నాట్యోత్సవం 2కు రంగం సిద్ధం

హైదరాబాద్‌లో శాస్త్రీయ నృత్య కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ‘భావ రస నాట్యోత్సవం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28, 2026న...

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల

ది కింగ్ ఆఫ్ కంటెంట్ Sree Vishnu హీరోగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ N. T. Rama Rao Jr. విడుదల చేశారు. హుస్సేన్ షా...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.. ఏందయ్యా అది. ఆ డ్యాన్స్ ఏందీ.....

Chiranjeevi: ‘50 రోజుల మన శంకరవరప్రసాద్ గారు’.. వండర్స్ ఎన్నో..

Chiranjeevi: ఓ సినిమా హిట్టయితే టీమ్ కి ఆనందం. నటీనటులకు సంతోషం. బయ్యర్లకు సంబరం. కానీ, ఓ సినిమా హిట్టయితే వీటన్నింటితోపాటు ఆ సినిమా హీరో అభిమానులకు పండగ.. ఎనలేని ఉత్సాహం. ఆనందభాష్పాలతో...

Virosh: విజయ్-రష్మిక పెళ్లి.. కిలోల కొద్దీ బంగారం.. వివరాలివే

Virosh: విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి  ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో అతితక్కువమంది కుటుంబసభ్యులు, బంధు, మిత్రుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. అయితే.. పెళ్లిలో విజయ్-రష్మిక ధరించిన పెళ్లి ఆభరణాలు ప్రత్యేక...