Switch to English

కోర్టు కేసుల కోసం కోట్లు ఖర్చైపోతున్నాయ్.! ఎవడబ్బ సొమ్మనీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

కోర్టు కేసుల కోసం ప్రభుత్వం వందల కోట్లు వృధా చేస్తోందా.? కేవలం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పర్యావరణ అనుమతుల వివాదానికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనల కోసమే వంద కోట్ల పైన ఖర్చయ్యిందా.? ‘ఇంతమంది లాయర్లు వాదించాల్సిన అవసరమేంటి.? ఎంత ప్రజాధనం దుర్వినియోగమవుతోంది.?’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేయడం అంతటా చర్చనీయాంశమయ్యింది.

కేవలం పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల వివాదం మీదనే 100 కోట్లు ప్రభుత్వం న్యాయవాదుల కోసం ఖర్చు చేస్తోన్నమాటే నిజమైతే, వందలు కాదు.. వేల కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో వున్నాయ్. వాటి కోసం ప్రభుత్వం ఇంకెంతలా ఖర్చు చేస్తోందిట.? ఈ ప్రశ్న సహజంగానే, రాష్ట్ర ప్రజానీకంలో అలజడిని రేకెత్తిస్తోంది.

ప్రత్యేకించి, రాజధాని అమరావతి విషయమై వైఎస్ జగన్ సర్కారు, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో తమ వాదనల్ని బలంగా వినిపించేందుకు ప్రముఖ న్యాయవాదుల్ని నియమిస్తున్న సంగతి తెలిసిందే.

‘అమరావతిలో ఉద్యమిస్తున్నది పేద రైతులు కాదు.. కోట్లు వెచ్చించి లాయర్లను పెట్టుకుంటున్నారు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..’ అని గతంలో వైసీపీ ఆరోపణలు చేయడం చూశాం. పలువురు మంత్రులు కూడా ఇవే ఆరోపణలు చేశారు. మరి, ఆ అమరావతి రైతుల తరఫున వాదిస్తోన్న న్యాయవాదులకు ధీటుగా ప్రభుత్వం కూడా కొందరు ‘ఖరీదైన న్యాయవాదుల్ని’ రంగంలోకి దించింది కదా.? దాని మాటేమిటి.?

హైకోర్టు మొట్టికాయలేసినా, సుప్రీంకోర్టు తలుపు తట్టి.. అక్కడా మొట్టికాయలేయించుకోవడం వైసీపీ సర్కారుకి కొత్తేమీ కాదు. కేసులో నెగ్గలేమని తెలిసీ, న్యాయస్థానాల్ని ప్రభుత్వం ఆశ్రయిస్తున్నది, ప్రజల సొమ్ముని వృధాగా ఖర్చు చేయడం కోసమేనన్న విపక్షాల విమర్శల్లోనూ వాస్తవం లేకపోలేదనిపించడం మామూలే.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం, చంద్రబాబుపైనా, ఆయన తనయుడు లోకేష్ మీదా కేసుల వ్యవహారాలు.. చెప్పుకుంటూ పోతే, మూడొందల కేసులు.. ముప్ఫయ్ మూడు వేల ఆరోపణలు.. అన్నట్లు తయారైంది పరిస్థితి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, ఎన్ని వందల కోట్లు.. ఎన్ని వేల కోట్లు కోర్టు ఖర్చుల కోసం అధికారపక్షం వృధా చేస్తోందబ్బా.? అన్న డౌటానుమానం ప్రజల్లో కలగడం సహజమే కదా.!

‘ఎంత సొమ్ము వృధా చేస్తున్నారో లెక్కలు తేల్చాలని ఆదేశాలిస్తాం..’ అని సుప్రీంకోర్టు హెచ్చరించే స్థాయికి వచ్చిందంటే, పరిస్థితి తీవ్రంగా వుందన్నమాట. హెచ్చరించడం కాదు, ఆ ఆదేశాలు ఏవో ఇచ్చేస్తే, ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తోందో ప్రజలకీ ఓ ఐడియా వస్తుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...