మతపరమైన కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్ళిన కొందరు, వస్తూ వస్తూ తమ వెంట కరోనా వైరస్ని మోసుకొచ్చారట. అలా కరోనా వైరస్ని మోసుకొచ్చినవారి సంఖ్య పదుల్లోనే వున్నట్లు ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకూ ఢిల్లీ నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వెనుక అసలు కోణం సదరు ‘మత పరమైన కార్యక్రమం’ అంటూ చర్చ జరుగుతోంది. అలా ఢిల్లీకి వెళ్ళి వచ్చినవారిలో కొందరు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగానే ప్రకటన చేయడం గమనార్హం.
తెలంగాణలో అనూహ్యంగా నిన్న ఒక్క రోజే ఐదు మరణాలు సంభవించినట్లు అధికారికంగా వెల్లడయ్యింది. మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఓ మరణంతో కలుపుకుంటే, మొత్తంగా తెలంగాణలో ఆరు మరణాలు చోటు చేసుకున్నాయి కరోనా వైరస్ కారణంగా. కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ‘ఢిల్లీకి వెళ్ళొచ్చిన’ వారిపై నిఘా పెట్టారు.
ప్రత్యేకంగా సదరు మత పరమైన కార్యక్రమానికి హాజరయినవారెవరు.? అని ఆరా తీసే ప్రయత్నాల్లో వుంది అధికార యంత్రాంగం. వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఆ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళినట్లు తెలుస్తోంది. మత పరమైన కార్యక్రమం కోసం వెళ్ళి, ఇలా కరోనా వైరస్తో తిరిగి రావడం పట్ల బాధితుల కుటుంబాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వెళ్ళిన వ్యక్తులతోపాటు, వారి కుటుంబాల్నీ క్వారంటీన్లోకి పంపడం మినహా, ప్రస్తుతం చేయగలిగిందేమీ లేదు.
మరోపక్క, ఢిల్లీ ప్రభుత్వం ఆ మత పరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన మత పెద్దపై కేసుల నమోదుకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. విదేశాల నుంచి భారతదేశానికి కరోనా వైరస్లు మోసుకొచ్చినవారికంటే, ఢిల్లీ నుంచి కరోనా వైరస్ని మోసుకొచ్చినవారి సంఖ్యే ఎక్కువ వుంటుందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆయా వ్యక్తులు దేశంలో ఏయే ప్రాంతాల్లో సంచరించారు.? అన్న దిశగా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.
907239 976994I gotta favorite this internet website it seems quite beneficial . 459113