మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow
మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒకేరోజు నాలుగు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి లోకేష్ నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించారు. అలాగే మంగళగిరి-తాడేపల్లి భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన వైకుంఠ మహాప్రస్థానాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నిడమర్రు ఆర్వోబీకి శంకుస్థాపన:

మంగళగిరి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నంబూరు-మంగళగిరి రైల్వే సెక్షన్‌లోని 14వ నెంబర్ లెవల్ క్రాసింగ్ వద్ద రూ.142 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మించనున్నారు.

మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాలను అనుసంధానించే ఈ మార్గంలో రైల్వే గేటు కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకు సుమారు 60 రైళ్లు ప్రయాణించే ఈ మార్గంలో గేటు మూసివేత వల్ల ఎనిమిది నుంచి పది గంటల వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

767.5 మీటర్ల పొడవుతో, నాలుగు లేన్ల రహదారితో నిర్మించే ఈ ఆర్వోబీపై 15 మీటర్ల వెడల్పు క్యారేజ్ వే ఉండనుంది. రెండు వైపులా సర్వీస్ రోడ్లు, భద్రతా ఏర్పాట్లు కూడా కల్పించనున్నారు. దీంతో అమరావతి, మంగళగిరి మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు భవిష్యత్ పట్టణీకరణకు కూడా ఊతమివ్వనుంది.

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

కాజ ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభం:

మంగళగిరి మండలం కాజ గ్రామంలో రూ.3.3 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సెల్‌కాన్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసిన ఈ పార్క్ ప్రజలకు ఆరోగ్యకరమైన, పర్యావరణహిత జీవనశైలిని అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది.

17.18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ పార్క్‌ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. 1.7 కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలం, లైటింగ్ వ్యవస్థ, భద్రతా ఫెన్సింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.

పార్క్‌లో 42 రకాల జాతులకు చెందిన 12,800 మొక్కలను నాటడం విశేషం. ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ మొక్కను నాటి, పార్క్‌లోని వసతులను పరిశీలించారు.

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

రూ.1,167 కోట్ల భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు శ్రీకారం:

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు మొత్తం రూ.1,167.50 కోట్ల వ్యయం అంచనా వేశారు.

రెండు దశల్లో అమలు కానున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 531 కిలోమీటర్ల యూజీడీ నెట్‌వర్క్ నిర్మించనున్నారు. అలాగే 20 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు), 18 లిఫ్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

మొదటి దశలో రూ.604.32 కోట్లు, రెండో దశలో రూ.563.18 కోట్లు వెచ్చించనున్నారు. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి.

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

వైకుంఠ మహాప్రస్థానం ఆధునీకరణ:

మంగళగిరిలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన వైకుంఠ మహాప్రస్థానాన్ని కూడా మంత్రి లోకేష్ సందర్శించారు. బిట్రావారి వీధి సమీపంలోని 2.90 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు.

ఫీనిక్స్ ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధులు, ఇతర సహకారంతో రూ.3.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో నాలుగు ఆధునిక దహన వేదికలు, నిరీక్షణ మందిరాలు, భోజనశాల, కార్యాలయం, అస్థికల భద్రతా గది, ఆచార గదులు, క్షౌరశాల, మరుగుదొడ్లు, కలప నిల్వ షెడ్, మార్చురీ బాక్స్‌లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.

అదనంగా సౌర విద్యుత్ దీపాలు, సుందరీకరణ పనులు, శిల్పాలు, జనరేటర్ సౌకర్యం కల్పించడం ద్వారా అంత్యక్రియల కోసం వచ్చే కుటుంబాలకు మెరుగైన వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

మంగళగిరి నియోజకవర్గంలో రవాణా, పర్యావరణం, పారిశుద్ధ్యం, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ఈ నాలుగు ప్రాజెక్టులు ప్రాంత భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

శ్రీసిటీలో లోకేష్ కీలక ప్రకటనలు.. ఏపీకి 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రస్తుతం సుమారు 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా...

Horoscope: వృషభ రాశికి ఆర్థిక పురోగతి.. కుంభ రాశికి శుభవార్త

జులై 7, 2026 మంగళవారం రాశిఫలాలు: చంద్రమాన పంచాంగం ప్రకారం ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించనుండగా, మరికొన్ని రాశుల వారు ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు....

‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ టీజర్‌కు కౌంట్‌డౌన్

పాన్ ఇండియా చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. టీజర్ విడుదలకు ఇక కేవలం మూడు రోజులే మిగిలి ఉన్నాయని...

Daily Horoscope: సింహ రాశికి ఆర్థిక లాభం.. మీన రాశికి శుభవార్త

జులై 4, 2026 శనివారం రాశిఫలాలు: ఈ రోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులను పరిశీలించి సిద్ధం చేసిన రాశి ఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం, ఆరోగ్యం,...

ప్రకృతే శాశ్వత సంపద: 18 నగర వనాలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

ప్రకృతితో కలిసి సాధించే అభివృద్ధే శాశ్వతమని, భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan అన్నారు....