మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలను అల్లాడించి అతలాకుతలం చేసిన మిడతల దండు పాకిస్తాన్ మీదుగా ఇండియా చేరింది. ప్రస్తుతం ఉత్తర భారతంలో ఈ మిడతల దండు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట పొలాలను సర్వ నాశనం చేస్తూ కోట్ల నష్టం కలిగిస్తున్న మిడతలను ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వం సూచించింది.
ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ మిడతల దండు సంచరిస్తూ పంట పొలాలను టార్గెట్ చేస్తున్నాయి. పెద్ద ఎత్తున రైతులకు నష్టం కలిగిస్తున్న మిడతలను చంపేందుకు జిల్లా అధికారులు రాత్రి సమయంలో కెమికల్స్ పిచికారీ చేస్తున్నారు. ఈ విషయమును ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. పలు దేశాల్లో మిడతల వల్ల రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు ఈ విషయంలో ఎలా స్పందిస్తాయి అనేది చూడాలి.
345044 512283Thanks for blogging and i enjoy the weblog posting so no public comments.,,,,,,,,,,, 699587
333217 611369I enjoy reading article. Hope i can locate much more articles like this 1. Thanks for posting. 566767