దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. దేశంలో ఇప్పటి వరకు 803 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే 76 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈ రోజు 10 కొత్త కేసులు నమోదు కావడం విశేషం. నిన్నటి వరకు 44 కేసులు నమోదుకాగా, ఈరోజు అనూహ్యంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఇప్పుడు అమలు చేస్తున్న నిబంధనలతో పాటుగా మరింత కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో తీవ్రత పెరుగుతుండటంతో పాటుగా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఎంత చెప్తున్న ప్రజలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నారు. అంతర్జాతీయంగా, ఇతర రాష్ట్రాల వచ్చే ప్రజా రవాణా ఆగిపోయింది. ఇప్పుడు స్థానికంగా ఉన్న వ్యక్తుల నుంచే వైరస్ వ్యాపిస్తోంది. ఈ వ్యాప్తిని ఇప్పుడు కట్టడి చేయగలిగితేనే కరోనా నుంచి బయటపడగలుగుతాం. ఒకవేళ అదుపుతప్పితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఎవరూ కూడా చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితమే పేర్కొన్నారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, అవి చేయి దాటిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలోకి కేంద్ర బలగాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏప్రిల్ 14 వరకు విధించిన లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు లేదంటే మే నెలాఖరు వరకు పొడిగించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం. అందుకోసమే కేంద్రం మూడు నెలలపాటు రేషన్ సౌకర్యం కల్పించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆర్బీఐ కూడా మూడు నెలల పాటు ఈఎంఐ లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఐసిఎంఆర్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
619286 510238But wanna say that this really is quite helpful , Thanks for taking your time to write this. 391192