‘సింహా ‘, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ చేస్తున్న మూడవ సినిమా మార్చిలో మొదలై ఒక రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఈ కరోనా ఎఫెక్ట్ వలన సినిమా షూటింగ్ ని ఆపారు. సినిమా అనుకున్న టైం కంటే ఆలస్యంగా మొదలైంది దానికి కారణం బడ్జెట్, లొకేషన్స్, హీరోయిన్స్ ఇలా పలు రకాలు.
ఫైనల్ గా అన్నీ ఫినిష్ చేసి స్టార్ట్ చేయగానే కరోనా అనే మహమ్మారి వచ్చి పడింది. ఈ కరోనాకి పరిష్కారం దొరికేనా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. దాంతో సినీ పరిశ్రమ ఇంకో 6 నెలలు కోలుకునే స్థితి కనపడడం లేదు. ఈ కరోనా ఎఫెక్ట్ బాలయ్య సిఎంమా మీద కూడా గట్టిగానే పడుతోంది.
ఎలా అంటే ఈ చిత్ర టీం మొదటగా ఓ భారీ షెడ్యూల్ ని వారణాశిలో ప్లాన్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఆ షెడ్యూల్ కాకుండా హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ ఎత్తేసినా మరో 6 నెలల పాటు ఎవ్వరికీ వేరే రాష్ట్రాల్లో పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ లేదు. దాంతో ఈ చిత్ర టీం ఇబ్బందుల్లో పడింది. వారణాశి సెట్ ఇక్కడ వేయడం చాలా కష్టం. అలా వేయాలన్న బడ్జెట్ ఇష్యూ ఉంది. దాంతో ఈ చిత్ర టీం ఏం చేయాలి? కథలో, పాత్రల్లో మళ్ళీ మార్పులు చేయాలా? లేక బడ్జెట్ లో మార్పులు చేయాలా? అనుకుంటూ ఆలోచనలో పడ్డారు.
మరి ఈ కరోనా లాక్ డౌన్ అయ్యేలోపు బోయపాటి శ్రీను అండ్ టీంకి ఒక పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి. బాలయ్య సరసన అంజలిని హీరోయిన్ గా ఖరారు చేయగా మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ ని మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు.
501331 916280We offer the most effective practical and most applicable solutions. All our Sydney plumbers are experienced and qualified and are able to rapidly assess your dilemma and locate the top answer. 911968
942628 243557I enjoy this internet site, will undoubtedly arrive back. Make certain you carry on writing high quality posts. 891485