కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో మరిన్ని కఠిన చర్యలకే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రాలతోపాటు జిల్లాల సరిహద్దులు కూడా మూసివేయాలని సూచించింది. అత్యవసర, నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే వాహనాలు మినహా మిగిలినవాటిని అస్సలు అనుమతించొద్దని స్పష్టంచేసింది.
సరిహద్దు దాటినవారిని 14 రోజుల క్వారంటైన్ కు తీసుకెళ్లాలని పేర్కొంది. అలాగే వలస కూలీలను నియంత్రించాలని పేర్కొంది. ఇక విద్యార్థులు, కార్మికులను ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఇంటి యజమానులు ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
భారత్ లో కరోనా కేసులు వేయికి చేరువుతున్న తరుణంలో కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 987 కేసులు నమోదు కాగా, 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రజల రక్షణ కోసమే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల తనను క్షమించాలని కోరారు. ముఖ్యంగా రోజువారీ కూలీల బాధలు తాను అర్థం చేసుకోగలనన్నారు. ప్రజలు తమను, తమ కుటుంబాన్ని రక్షించుకునేందుకే లాక్ డౌన్ విధించామని, మరికొన్ని రోజులు ఇది కొనసాగించక తప్పదని స్పష్టంచేశారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6,68,351 కేసులు నమోదు కాగా, ఈ మహమ్మారి కారణంగా 31,020 మంది మృత్యువాతపడ్డారు. 1,23,780 కేసులతో అమెరికాలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికి అగ్రరాజ్యంలో 2,229 మంది ప్రాణాలు కోల్పోయారు.
323015 849541Thanks for your time so significantly for your impressive and incredible guide. I will not be reluctant to endorse your internet sites to any individual who ought to receive direction on this issue. 29302
761905 514504Thanks for the data provided! I was researching for this post for a long time, but I was not able to see a dependable source. 460267
971972 514247I truly treasure your piece of work, Excellent post. CHECK ME OUT BY CLICKING MY NAME!!! 160825