ఈ నెల 18వ తేదీ నుంచి ‘లాక్డౌన్ 4.0’ అమల్లోకి రాబోతోంది. ఏ క్షణాన అయినా, ఈ ‘లాక్ డౌన్ 4.0’కి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల కావొచ్చు. కేంద్రం, ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్రాల నుంచి కొన్ని అభిప్రాయాల్ని కూడా సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్ తరఫున ఓ ‘సూచన’ కేంద్రానికి ‘సడలింపుల’ విషయమై వెళ్ళిందట. అందులో, కొన్ని దుకాణాలు ప్రతిరోజూ తెరిచి వుండేలా కాకుండా, రోజు తప్పించి రోజు మాత్రమే తెరిచి వుండేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. సోమ, బుధ, శుక్రవారాల్లో తెరిచే దుకాణాల విషయానికొస్తే, ఆటోమొబైల్స్, మొబైల్ షాప్స్, హార్డ్వేర్, శానిటరీ, ఐరన్ షాప్, సైకిల్ షాప్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, వెస్సెల్స్కి అవకాశమిస్తారు. ప్రతిరోజూ తెరుచుకునే దుకాణాల్లో స్వీట్స్ అండ్ బేకరీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, మెడికల్ అండ్ గ్రోసరీ, ఆటోగ్యారేజ్లుంటాయి. మంగళవారం, గురువారం, శనివారం విషయానికొస్తే, రెడీమేడ్ గార్మెంట్స్, వస్త్రాలయ, ఫుట్వేర్, ప్రింటింగ్ ప్రెస్, ఆప్టీషియన్, బుక్ అండ్ స్టేషనరీ, ఫర్నిచర్ – బ్యాగ్, జ్యుయెలరీ షాప్స్, టెయిలరింగ్, కాస్మెటిక్ అండ్ జనరల్ స్టోర్స్కి అవకాశమిస్తారు.
ఇదిలా వుంటే, ‘లాక్డౌన్ 4.0’ వెసులుబాట్ల విషయమై రాష్ట్రాలకే అధికారాలు కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తున్న దరిమిలా, రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రతిపాదనలకు పూర్తిస్థాయిలో ఆమోదం లభించవచ్చు. అంటే, పైన పేర్కొన్నవన్నీ మే 18 నుంచి ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇదిలా వుంటే, రెడ్ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలోనూ వైఎస్ జగన్ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. సీట్ల మధ్య గ్యాప్ వుంచడం సహా అనేక ఆలోచనలు ఇప్పటికే చేసిన జగన్ సర్కార్, రెండు మూడు రోజుల్లోనే ప్రజా రవాణాపైనీ కీలక నిర్ణయం తీసుకోవచ్చు.
791082 472530I want reading by means of and I conceive this website got some truly utilitarian stuff on it! . 488131