బినామీ రచ్చ: లింగమనేని వ్యధ.. ఇది రాజకీయ కథ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,409FansLike
57,764FollowersFollow

ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైకి లేఖాస్త్రం సంధించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి బినామీగా తనను అభివర్ణించడంపై లింగమనేని ఆ లేఖాస్త్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘అప్పుడు చంద్రబాబే కాదు, ఇంకెవరు అధికారంలో వున్నా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నా గెస్ట్‌ హౌస్‌ని అద్దెకు ఇచ్చేవాడినే..’ అంటూ లింగమనేని రమేష్‌ ఆ లేఖాస్త్రంలో ప్రస్తావించారు. తనకు రాజకీయాలు ఆపాదించవద్దనీ ఆయన విజ్ఞప్తి చేశారు.

మరోపక్క, అభివృద్ధి చెందిన హైద్రాబాద్‌ని కాదని, విజయవాడ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాల్ని విస్తరించి, ఆ ప్రాంత అభివృద్ధిని కాంక్షించారంటూ లింగమనేని రమేష్‌పై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సానుభూతి వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వైసీపీ నేతలూ కొందరు ఈ భావనతో ఏకీభవిస్తున్నారు.

ఇక్కడ వచ్చిందల్లా ఒకే ఒక్క సమస్య. లింగమనేని రమేష్‌ గెస్ట్‌ హౌస్‌ని చంద్రబాబు వినియోగించుకోవడం. ఒకవేళ చంద్రబాబు గనుక ఆ గెస్ట్‌ హౌస్‌లో నివాసం ఏర్పాటు చేసుకోకుండా వుండి వుంటే, అసలు ఈ సమస్యలే వచ్చి వుండేవి కావు. అయితే, గతంలోనూ లింగమనేనిపై ‘చంద్రబాబు బినామీ’ అనే విమర్శలొచ్చాయి. కానీ, అప్పుడాయన లైట్‌ తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిపైకే లేఖాస్త్రం సంధించారు.

రాజకీయాల్లో ‘బినామీ’ అనే మాట తరచూ విన్పిస్తుంటుంది. శేఖర్‌ రెడ్డిని చంద్రబాబుకి బినామీ అన్నారు. మేఘా సంస్థ కూడా చంద్రబాబుకి బినామీనే అని గతంలో వైసీపీ ఆరోపించిన మాట వాస్తవం. నవయుగ సంగతి సరే సరి. కానీ, ఏమయ్యింది.? నవయుగ చేతిలో ఇప్పటికే వున్న కాంట్రాక్ట్‌ని రద్దు చేసి, కొత్తగా అప్లయ్‌ చేసుకోవాలని జగన్‌ సర్కార్‌ సూచించింది.

గతంలో ఏ మేఘా సంస్థపైన అయితే ఆరోపణలు చేసిందో అదే మేఘా సంస్థకు వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల్ని అప్పగించింది. శేఖర్‌ రెడ్డి సంగతి సరే సరి. లేఖాస్త్రం సంధించడం కాకుండా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సరెండర్‌ అయిపోతే, లింగమనేని గెస్ట్‌ హౌస్‌కి కూడా ఇబ్బందులు వుండకపోవచ్చు. పైగా, అధికారిక కార్యకలాపాల కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ భవనాన్ని వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

లింగమనేని , జగన్ కు రాసిన లెటర్ ఇక్కడ క్లిక్ చేసి చదవండి

8 COMMENTS

సినిమా

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

‘లెనిన్’ జోరు.. మూడు రోజుల్లో రూ.61 కోట్ల వసూళ్లు!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా...

Johnny Master: శేఖర్ మాస్టర్ తో గొడవ..! జానీ మాస్టర్ ఇచ్చిన...

Johnny Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ డాన్స్ అసోసియేషన్ హాల్ లో పోలీసుల సమక్షంలోనే వాదులాడుకున్న వీడియో వైరల్ కావడం తెలిసిందే....

Jr.Ntr: రాష్ట్ర రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ..! అభిమానుల సంఘం స్పష్టత

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్, రాజకీయవర్గాలు, ఇండస్ట్రీలోనూ ఆసక్తి...

రాజకీయం

కడపలో రూ.3,100 కోట్ల భారీ పెట్టుబడి.. దాల్మియా రెండో ప్లాంట్‌కు లోకేష్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల పెట్టుబడులకు ఊతమిస్తూ ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. కడప జిల్లాలో దాల్మియా భారత్ సిమెంట్ సంస్థ రూ.3,100 కోట్లతో చేపట్టనున్న రెండో ప్లాంట్ విస్తరణ పనులకు బుధవారం...

పవన్ కళ్యాణ్ చికిత్సపై మాజీ ఐపీఎస్ వ్యాఖ్యలు.. జనసేన నుంచి వివరణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని స్పందించింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో...

సాక్షి కథనంపై ప్రభుత్వం స్పందన.. అమరావతి భూములపై అసలు నిజాలివే!

అమరావతి రాజధానికి సంబంధించిన భూముల విషయంలో సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖండించింది. “ఆగిన రాజధాని రైతు గుండె” శీర్షికతో వచ్చిన వార్తలో పేర్కొన్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని,...

తెలంగాణలో జనసేన ఫోకస్.. 17 లోక్‌సభ స్థానాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు!

తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ, గ్రామస్థాయి వరకు కార్యకర్తలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ...

చింతూరు అడవుల్లో డ్రోన్లతో సీడ్ బాల్స్.. ఏపీలో తొలిసారి!

ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా అటవీశాఖ మరో కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్...

ఎక్కువ చదివినవి

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి వంటి అంశాలపై అసత్య ప్రచారం చేస్తూ...

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్‌పై వివాదం.. వైసీపీపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు

రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. అమరావతికి కీలకమైన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అంశాన్ని...

Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో చాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ..! క్లారిటీ ఇచ్చిన అట్లీ

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రాకా’. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎంటర్‌టైనర్...

శ్రీసిటీలో మోటివ్ లింక్ పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. ఈవీ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మోటివ్ లింక్ (MOTIVELINK) ప్రతినిధులతో సమావేశమయ్యారు....