ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన లెజండరీ దర్శకులు కె విశ్వనాథ్ ఇకలేరు. ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. చెన్నైలోని విజయ వాహిని స్టూడియోస్ లో సౌండ్ ఇంజనీర్ గా మొదలైన ఆయన ప్రయాణం పాతాళభైరవి చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడిగా ఆపై ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసాక ఆపై వెనుతిరిగి చూడలేదు.
మొదటి చిత్రంతోనే నేషనల్ అవార్డు అందుకున్న కె విశ్వనాథ్ ఆపై తన కెరీర్ లో మొత్తం ఐదు జాతీయ అవార్డులు, ఏడు నంది అవార్డులు, 10 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. 1992వ సంవత్సరంలో ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
సాగరసంగమం, శంకరాభరణం, స్వయంకృషి, స్వాతిముత్యం, స్వాతికిరణం, శృతిలయలు, ఆపద్బంధవుడు, శృతి లయలు, సూత్రధారులు, వంటి క్లాసికల్ చిత్రాలు అందించిన మహనీయుడు ఆయన. తన కెరీర్ లో హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ నటుడిగా కూడా పేరున్న చిత్రాలే చేసారు. ఆయన లేని లోటు చిత్రసీమకు పూడ్చలేనిది.