Switch to English

కరోనాతో సహజీవనం ఎలా చెయ్యాలంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

‘లాక్‌డౌన్‌’తో కరోనా వైరస్‌ని దేశం నుంచి తరిమేద్దామంటూ గొప్ప గొప్ప ‘పలుకులు’ పలికిన పాలకులు ఇప్పుడు చేతులెత్తేశారు. ‘కరోనా వైరస్‌తో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అది కరీనా కపూర్‌ కాదు సామీ.. కరోనా వైరస్‌.. ప్రమాదకరమైన వైరస్‌తో సహజీవనమేంటి.? అంటూ జనం నెత్తీ నోరూ బాదుకుంటున్నా.. తప్పదు, సహజీవనం చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు తెగేసి చెబుతున్నారు.

ఏం చేస్తాం, పాలకులు ఎలా చెబితే అలా చేయాల్సిందే. ఇంతకీ, భవిష్యత్‌ ఎలా వుండబోతోంది.? కరోనా వైరస్‌తో సహజీవనం చేయడం ఎలా.? అసలంటూ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలే లేవంటూ పరిశోధకులు తేల్చి చెబుతున్న వేళ, కరోనా వైరస్‌ని భరించడమెలాగో అర్థం కావడంలేదు సామాన్యులకి. మాస్క్‌ని మన జీవితంలో ఓ భాగం చేసుకోవాలి ఇకపై.. కానీ, ఇదొక్కటే కరోనా వైరస్‌ని దూరంగా వుంచుతుందా.? అంటే సమాధానం దొరకని పరిస్థితి.

శానిటైజర్లు వాడాలి.. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. అవన్నీ జరిగే పనులేనా.? అనడగొద్దు. పాలకులు చెబుతున్నారు.. మనం పాటించాల్సిందే. దేనికీ గ్యారంటీ లేదు.. కానీ, అన్నీ పాటించాలి.. ఇదే మరి ‘ఖర్మ’ అంటే. కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తేనే, ఇప్పుడు కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 82 వేలకు చేరుకుంది. లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు ఇచ్చేశాక.. అది ఎన్ని లక్షలకు చేరుకుంటుందో, ఎన్ని వేల మరణాలు చోటు చేసుకుంటాయో చెప్పలేని పరిస్థితి.

ప్రపంచ దేశాలకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగామంటూ కేంద్రం చెబుతున్న గొప్పలకీ.. దేశంలో పరిస్థితులకీ స్పష్టమైన తేడా వుంది. ప్రపంచ దేశాలతో పోల్చితే, బారతదేశంలోనూ ఆర్థిక వ్యవస్థ అనూహ్యమైన రీతిలో కుప్పకూలిపోయింది. అభివృద్ధి చెందుతున్న మన దేశం ఈ కరోనా వైరస్‌ నుంచి కోలుకోవడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ తరుణంలో ‘ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌’ అంటూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి, ‘కండిషన్స్‌ అప్లయ్‌’ అంటోంది కేంద్రం.

కేంద్రం తీరు అలా వుంటే, రాష్ట్రాలూ ఇందుకు భిన్నంగా ఏమీ వ్యవహరించడంలేదు. ఖజనా నింపుకోవడానికి మద్యం దుకాణాల్ని తెరిచారు.. మద్యం రేట్లు మాత్రమే కాదు.. అన్ని రేట్లూ పెంచుకుంటూ పోతున్నాయి ప్రభుత్వాలు. అసలే, రెండు నెలలుగా లాక్‌డౌన్‌ దెబ్బకి జేబులు ఖాళీ అయిపోయిన బడుగు జీవులు, ఈ పెరిగిన ధరలతో ‘చావే శరణ్యం’ అనే స్థితికి వచ్చేస్తున్నారు. సహజీవనం సంగతి దేవుడెరుగు.. అసలంటూ ప్రాణాలతో వుండాలి కదా.? అని ఆర్థిక సమస్యల్ని ఏకరువు పెడుతున్న దేశ ప్రజానీకానికి ఏం సమాధానమిస్తారు పాలకులు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...