అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్.. సోగ్గాడే చిన్ని నాయన సినిమాల హీరోయిన్ లావణ్య త్రిపాఠి కుల వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ అమ్మడికి అవకాశాలు లేవు .. ఇలాంటి సమయంలో ఈ అమ్మడు ఇలా కుల వివాదంలో ఇరుక్కోవడం అందరికి షాకిస్తుంది.
ఇంతకీ లావణ్య త్రిపాఠి ఎందుకు కుల వివాదంలో ఇరుక్కుందంటే .. రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో అఖిల బ్రాహ్మణా మహా సభను ఏర్పాటు చేసారు. ఈ సభకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్ళాడు. ఈ నేపథ్యంలో అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్తానం ఉంది. బ్రాహ్మణుల త్యాగం వల్లే ఈ రోజు ఈ సభ ఏర్పాటైంది. అందుకే బ్రాహ్మణ సంఘం అందరికి మార్గదర్శకంగా నిలుస్తోంది అని కామెంట్ పెట్టారు.
ఈ ట్విట్ పై హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ ఓ బ్రాహ్మణ అమ్మాయిగా ఈ కులం వారికి సమాజంలో ఎందుకింత అధమ స్తానం ఉందొ నాకు అర్థం కావడం లేదు. మనం చేసే పనులే మన స్థాయిని తెలియచేస్తాయి .. కానీ కులం కాదు అంటూ ట్విట్ చేసింది.
Also Read: ‘సాహో’పై కసి తీర్చుకుంటున్న బాలీవుడ్.!
ఆ ట్విట్ చేసిన కాసేపటికే దాన్ని తొలగించడం విశేషం. అయితే అప్పటికే ఆ ట్విట్ వైరల్ అయింది. ప్రస్తుతం లావణ్య పెట్టిన మెసేజ్ గురించే అందరు చర్చించుకుంటున్నారు. అనవసరమైన కామెంట్స్ తో లావణ్య కుల వివాదంలో ఇరుక్కోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆమె అభిమానులు.
