Switch to English

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,947FansLike
57,764FollowersFollow

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా, వైసీపీ అధినాయకత్వం.. తమ పార్టీ నాయకుల్ని ఏమార్చింది.

నిజాలేవీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు చేరకుండా సజ్జల రామకృష్ణా రెడ్డి అనే ఓ కోటరీ, వైసీపీని సర్వనాశనం చేసిందని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అలాంటి ఓ కోటరీకి చెందిన ఇంకో నాయకుడు విజయ సాయి రెడ్డి వైసీపీని ఇటీవల వీడారనుకోండి.. అది వేరే సంగతి.

ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుగడ 2029 ఎన్నికల్లో ఎలా వుండబోతోంది.? ఈ విషయమై తాజాగా ఓ సర్వే ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. వైసీపీకి 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదు.? విపక్షంలో వున్న వైసీపీ, సమర్థవంతంగా పని చేస్తోందా.? లేదా.? కూటమి లుకలుకల సంగతేంటి.? వంటి అంశాలపై ఆ సర్వే ఆసక్తికరమైన వివరాల్ని వెల్లడించింది.

వైసీపీకి 30 శాతానికి పైగా ఓటు బ్యాకు 2029 ఎన్నికల్లోనూ వచ్చే అవకాశం వుందనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు. అయితే, 2024 ఎన్నికలతో పోల్చి చూస్తే, వైసీపీ ఏమాత్రం పుంజుకునే అవకాశం లేదన్నది ఆ అంచనా సారాంశం.

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతోషంగానే వున్నారు. వైసీపీ అరాచక పాలనని ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ప్రధానంగా రోడ్లు, వైసీపీని దారుణంగా దెబ్బ తీశాయి గత ఎన్నికల్లో. ఆ నెగెటివిటీ వైసీపీ మీద 2029 ఎన్నికల్లో కూడా కొనసాగే అవకాశాలున్నాయి.

టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తుందని మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు. కూటమి కలిసి వున్నంతకాలం, వైసీపీకి కష్టకాలమేనన్నది సర్వేలో చాలామంది సాధారణ ప్రజలు చెప్పినమాట.

వైసీపీ హయాంలో జగన్ చెబుతున్న సంక్షేమం పట్ల ఓటర్లెవరూ సంతృస్తిగా లేరు. అసలు ఆ సంక్షేమాన్ని జనం ఎప్పుడో మర్చిపోయారు. సంక్షేమం పేరుతో పబ్లిసిటీ స్టంట్లను వైసీపీ చేసిందనే అభిప్రాయం జనంలో వుంది.

కాగా, 2029 ఎన్నికల నాటికి జనసేన పార్టీ సొంతంగా ఎదుగుతుందా.? అన్నదానిపై సర్వేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలో టీడీపీ వైపే ప్రజలు పూర్తి స్థాయి సానుకూలతతో వున్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సర్వేలో తేలింది.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, వైఎస్సార్సీపీ 2029 ఎన్నికల్లో ఇంకోసారి చతికిలపడే అవకాశాలే సుస్పష్టం. ‘జగన్ 2.0’ అని వైసీపీ శ్రేణులు చేస్తున్న హడావిడి జస్ట్ హంబక్ అంతే.! వైసీపీని వైసీపీ నాయకులు వీడిపోతున్నది, పార్టీ అధినాయకత్వం ప్రదర్శిస్తున్న మోనార్కిజం వల్లనే.!

సినిమా

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల...

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన...

రాజకీయం

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ గ్రేస్ తో ‘శశిరేఖ’ సాంగ్ త్వరలో..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంలో ఉన్న ‘శశిరేఖ’ పాట త్వరలో విడుదల కానుంది. కేరళలో అందమైన లొకేషన్లలో షూట్ చేసిన ఈ సాంగ్‌లో చిరు ఎంతో గ్రేస్‌తో, క్లాస్‌గా...

Daily Horoscope: డిసెంబర్ 4, 2025 గురువారం రాశిఫలాలు:

మేషం (Aries): ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉండి పనుల్లో వేగం చూపిస్తారు. కుటుంబ సభ్యులతో చిన్న విషయాల్లో అనుసరణ పెరుగుతుంది. అనుకున్న పని ఒకటి కొంచెం ఆలస్యంగా పూర్తవుతుంది. ఆర్థికంగా కొత్త...

BIGG BOSS 9 TELUGU E89: తొలి ఫైనలిస్ట్ కోసం దుమ్ము రేపిన టాస్కులు, ట్విస్ట్‌లు!

బిగ్ బాస్ సీజన్ 9 గురువారం ఎపిసోడ్ 89 లో  ఇంట్లో అల్లరి, ఆగ్రహం, డ్రామా, పోటీ అన్నీ పీక్‌కు చేరుకున్నాయి. తొలి ఫైనలిస్ట్‌ కోసం జరిగిన ఛాలెంజ్‌లు సభ్యుల సామర్థ్యాన్నీ, సహనాన్నీ...

మెగాస్టార్–వెంకటేష్ డ్యాన్స్ ఫెస్టివల్ రేపే స్టార్ట్

బహుదీర్ఘకాలం తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి స్క్రీన్‌పై స్టెప్పులేయబోతున్న అద్భుత కాంబినేషన్‌కు సమయం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్...

ఆర్టీసీ బస్సులో సీటు రగడ… ప్రయాణికుడిపై మహిళల దాడి

తుని–నర్సీపట్నం ఆర్టీసీ బస్సులో సీటు కోసం పెద్ద రగడ జరిగింది. ప్రయాణికుడు కూర్చున్న సీటుపై ముందుగా తాము కర్చీఫ్ వేసుకున్నామని చెప్పిన మహిళలు తీవ్ర కోపంతో అతనిపై దాడికి తెగబడ్డారు. కర్చీఫ్ ఉన్న...