లెజిస్లేటివ్ క్యాపిటల్గా కర్నూలు నగరానికి ‘హోదా’ ఇవ్వాలనుకుంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. దురదృష్టవశాత్తూ కర్నూలు ఇప్పుడు కరోనా క్యాపిటల్గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయిన ప్రాంతంగా కర్నూలు ఇప్పటికే రికార్డులకెక్కింది. ఆ జోరు ఇంకా తగ్గడంలేదు. ఆల్రెడీ కర్నూలులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ& 200 దాటేయడం గమనార్హం. తాజాగా నమోదయైన కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 234కి చేరుకుందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
కర్నూలు తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్రమేంటంటే, గుంటూరు జిల్లాలోని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలోనూ కరోనా కేసులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అక్కడ అక్కడ కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత మరీ అంత ఎక్కువగా లేకపోవడం కాస్త ఊరట.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆలోచనల నేపథ్యంలో విశాఖకు సంబంధించి ‘పూర్తి డేటా’ బయట పెట్టడంలేదంటూ అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఏదిఏమైనా, కర్నూలు – గుంటూరు జిల్లాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో తీవ్ర భయాందోళనక పరిస్థితులకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా.. ఇలా చాలా జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే వున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
మరోపక్క, కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక అత్యధిక సంఖ్యలో ఈ రోజే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య 80గా వుంది. అరవైకి పైగా కేసులు ఒకే రోజు నమోదవడం ఇది మూడో సారి ఇప్పటిదాకా. కరోనా వైరస్పై పోరాటంలో ముందున్నాం.. అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందిగానీ.. కేసుల సంఖ్య పరంగా ఏపీ ఎప్పుడు ఎలాంటి చెత్త రికార్డుల్ని మూటగట్టుకుంటుందో తెలియక రాష్ట్ర ప్రజానీకం ఆందోళన చెందుతోంది.
814417 786424Properly, that is great, but consider further options weve got here? Could you mind submitting an additional article relating to them also? Several thanks! 865348