హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై జరిగిన అత్యాచారంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నేరస్తుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. కాని అతడికి శిక్ష విషయంలో మాత్రం ఏళ్లకు ఏళ్లు సమయం పడుతుంది అంటూ కొందరు ప్రభుత్వంపై మండి పడుతున్నారు. అతడిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తుంటే కొందరు అతడిపై స్పీడ్ ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
కేటీఆర్ ట్విట్టర్లో బాలిక పై అత్యాచార విషయం తెలిసి తీవ్ర మనస్థాపంకు గురయ్యాను. నేరస్తుడిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులను ఆయన అభినందించారు. బాధిత కుటుంబంకు వెంటనే న్యాయం చేయాలని తాను కూడా కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలంటూ హోం మంత్రి మరియు డీజీపీని కోరుతున్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ తో చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో సజ్జనార్ వంటి వారు పదవిలో ఉంటే ఖచ్చితంగా ఎన్ కౌంటర్ చేసేవారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
638144 396355Some truly wonderful content material on this internet website , thankyou for contribution. 914827
672987 228360I like this internet blog really significantly so much superb information . 144240