ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి నిన్న భేటీ అవడం తెలుగునాట రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. తన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ విషయమై చిరంజీవి, జగన్ని కలిశారన్నది ఇరు వర్గాల నుంచి బయటకొచ్చిన సారాంశం. ‘వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సినిమా పనుల్లో బిజీగా వున్నాను.. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు.. ఇప్పుడు కలిసి అభినందనలు తెలిపా..’ అని చిరంజీవి చెప్పినట్లు సాక్షి మీడియాలో కథనం వచ్చింది.
సినీ పరిశ్రమకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా చిరంజీవి కోరితే, ‘తప్పకుండా చేస్తా..’ అని జగన్ హామీ ఇచ్చినట్లూ ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాని నిర్మించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ నుంచి జగన్ – చిరంజీవి భేటీపై కనీసం ఓ ట్వీట్ కూడా రాలేదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ని చిరంజీవి కలిస్తే, ఆ వ్యవహారంపై కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పలు ట్వీట్లు వేసింది. గవర్నర్కి కృతజ్ఞతలు కూడా తెలిపింది. కానీ, జగన్ విషయంలో ఎందుకు అలా జరగలేదు.?
అసలు చిరంజీవి – జగన్ భేటీలో చరణ్ కూడా పాల్గొంటారన్న ప్రచారం జరిగినా, చరణ్ ఎందుకు ఆ భేటీకి వెళ్ళలేదు.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఇదిలా వుంటే, చిరంజీవి – జగన్ని మర్యాదపూర్వకంగా కలిశారనీ, తన సతీమణి సురేఖను వెంటేసుకుని చిరంజీవి, జగన్ వద్దకు వెళ్ళారనీ, ఇందులో పెడార్ధాలు తీయడానికేమీ లేదనే వాదన మెగా అభిమానుల నుంచి వస్తోంది. కానీ, ఒక్క ట్వీట్.. కొణిదెల ప్రొడక్షన్ హౌస్ నుంచి పడి వుంటే.. ఈ విమర్శలకు ఆస్కారం వుండేది కాదు కదా.!
648361 606963Das beste Webdesign Berlin erhalten Sie bei uns, genauso wie professionelles Webdesign. Denn wir sind die Webdesign Agentur mit pfiff. 129136
459792 261660This really is a very good common sense write-up. Very helpful to one who is just finding the resouces about this part. It will undoubtedly support educate me. 784625
605136 986367Thanks for this exceptional. I was wondering whether you were preparing of writing related posts to this 1. .Maintain up the excellent articles! 861697