Konidela Anna lezhneva: తిరుమల ఎస్వీ అన్నదానం ట్రస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద విరాళం అందించారు. నేటి మధ్యాహ్నం అన్నవితరకు అయ్యే ఖర్చు రూ.17లక్షల చెక్కును అధికారులకు అందజేశారు. ఈక్రమంలో కొణిదల మార్క్ శంకర్ డొనేషన్ అమౌంట్ పేరుతో బోర్డుపై వివరాలు ప్రదర్శించారు.
సింగపూర్ సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్నిప్రమాదం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. నిన్న సింగపూర్ నుంచి కుమారుడితో సహా పవన్ దంపతులు ఇండియా కూడా చేరుకున్నారు. కుమారుడు క్షమంగా తిరిగిరావడంతో పవన్ భార్య, మార్క్ తల్లి అన్నా లెజినోవా తిరుమలలో తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుని శ్రీవారి ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆమె తిరుమల పర్యటనకు సంబంధించి ఫొటోలు, విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.