క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరడం ఖాయమని, కప్ కూడా కొట్టుకురావడం గ్యారెంటీ అని సగటు భారత క్రీడాభిమాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కోట్లాది మంది భారతీయులు ఆ మధుర క్షణాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ సెమీస్ పోరులో భారత జట్టు అనూహ్యంగా ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో క్రీడాలోకం నివ్వెరపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులారా ఓటమి కొని తెచ్చుకున్నారని భారత క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు.
భారత ఓటమికి వరుణుడే కారణమంటూ పలువురు ఆ నెపాన్ని వర్షంపై నెట్టేశారు. కానీ టీమిండియా ఓటమికి జట్టులో ఉన్న అంతర్గత విభేధాలే కారణమనే వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెలక్షన్ కమిటీ వ్యవహార శైలి వల్లే టీమిండియాకి ఈ పరిస్థితి ఎదురైందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిభ ఆధారంగా కాకుండా తమకు నచ్చినవారిని జట్టులోకి తీసుకోవడం వల్లే కోట్లాది మంది భారతీయుల ఆశలు అడియాసలు అయ్యాయని అంటున్నారు. స్టార్ ప్లేయర్లు మినహా మిగిలిన ఏ ఆటగాడైనా జట్టులోకి రావాలంటే కోహ్లీ మద్దతు ఉండాల్సిందేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రపంచకప్ టోర్నీకి జట్టు ఎంపిక చేసినప్పుడే విమర్శలు వచ్చాయి. అంబటి రాయుడు, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయకుండా ఏ మాత్రం ప్రభావం చూపలేని విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్ లను ఎంపిక చేయడంపై చాలామంది ఆశ్చర్యపోయారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కావాలనే అంబటి రాయుడిని జట్టులోకి ఎంపిక చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో వైదొలిగినా రాయుడికి అవకాశం రాకుండా చేయడంలో ప్రసాద్ కీలకంగా వ్యవహరించారని విమర్శలు చెలరేగాయి. చివరకు విజయ్ శంకర్ ని తప్పించినా.. తనకు పిలుపు రాకపోవడంతో రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. రాయుడి విషయంలో కోహ్లీ కూడా సానుకూలంగా లేడనే టాక్ వినపడుతోంది. అందువల్లే రెండుసార్లు అవకాశం వచ్చినా రాయుడిని పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. కోహ్లీ మద్దతు ఉండటం వల్లే కేఎల్ రాహుల్ జట్టులో కొనసాగగలిగాడని చెబుతున్నారు.
కోచ్ రవిశాస్త్రి కూడా జోక్యం చేసుకోవడంతో జట్టు తుది కూర్పు దెబ్బతిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నీ టీమిండియా రెండు గ్రూపులుగా విడిపోవడానికి కారణమయ్యాయని.. ఒక గ్రూప్ కి కోహ్లీ, మరో గ్రూప్ కి రోహిత్ శర్మ నాయకత్వం వహించారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సెమీస్ లో కివీస్ తో ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూంలో రెండు గ్రూపుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందని అంటున్నారు.
జట్టు ఎంపిక, కోచ్ జోక్యం తదితర పరిణామాలపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు జట్టు ఓటమిపై సమీక్షించడానికి బీసీసీఐ సిద్ధమైంది. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తదితరులపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఈ మేరకు వారిని సన్నద్దంగా ఉండాలంటూ సమాచారం పంపింది. నిజంగా అంతర్గత విభేదాలు, రాజకీయాల కారణంగానే జట్టు ఓడిపోయి ఉంటే, అందుకు బాధ్యులైనవారు ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కోట్లాది మంది క్రీడాభిమానుల ఆశలు అడియాసలు కావడానికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదు.
540115 463006But wanna remark that you have a quite decent internet site , I love the design it actually stands out. 427392
727791 880217Im not certain exactly why but this web web site is loading extremely slow for me. Is anyone else having this concern or is it a issue on my finish? Ill check back later and see if the dilemma still exists. 384023
235477 377580I got what you mean , saved to my bookmarks , very good website . 806332
562859 980407To know wisdom and instruction, to perceive the words of understanding 438512