తిరుమల డిక్లరేషన్ వివాదం వైసీపీకి భారీగానే డ్యామేజీ చేసిందా? చంద్రబాబు అండ్ కో వ్యూహాత్మకంగా విసిరిన ట్రాప్ లో వైసీపీ పడిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వైసీపికి ఇబ్బందిగానే పరిణమించాయని అంటున్నారు. ఓవైపు కేంద్రంతో దోస్తీ వైసీపీకి అవసరం.. అదే సమయంలో వైసీపీ రాజ్యసభ బలం బీజేపీకి అవసరం. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలూ ఓ అండర్ స్టాండింగ్ తో ముందుకెళ్లాలనే ఆయా పార్టీల అధిష్టాన పెద్దలు భావిస్తారు.
నిజానికి బీజేపీకి వైసీపీ అవసరం కంటే వైసీపీకి బీజేపీ అండ అత్యవసరం. నిధులు రావాలన్నా.. కేసుల విషయంలో ప్రతికూలతలు రాకూడదన్నా కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు నడపాల్సిందే. అయితే, డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర బీజేపీ.. వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించినా, పెద్ద సమస్య లేదు. కానీ ఎప్పుడైతే మంత్రి నాని ఈ వ్యవహారంలోకి ఎంటరై తనదైన శైలిలో విరుచుకుపడ్డారో వ్యవహారం మొత్తం వేడెక్కింది. భజరంగ్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగిపోయారు.
పోని ఇక్కడితే వదిలేస్తే ఏదో ఒక విధంగా వైసీపీ డ్యామేజీని పూడ్చుకుని ఉండేది. కానీ నాని అకస్మాత్తుగా తిరుమలలో ప్రత్యక్షమై ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శలు చేశారు. అయోధ్య భూమి పూజకు మోదీ ఏ భార్యతో వెళ్లారని.. యోగి ఎవరిని తీసుకెళ్లారంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఇది వైసీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది.
నిజానికి జగన్ తిరుమల వెళ్లడం ఇదే తొలిసారి కాదు. అయినా, డిక్లరేషన్ వ్యవహారం ద్వారా వైసీపీని ఇరుకున పడేయడానికే చంద్రబాబు మంచి ఎత్తుగడ వేశారు. ఈ ట్రాప్ లో నాని సులభంగా పడిపోయారు. బాబంటే అసలే దుందుడుకుగా వ్యవహరించే నాని.. ఆవేశంలో ఏకంగా మోదీనే టార్గెట్ చేశారు. బాబు కోరుకుంది కూడా ఇదే. నిజానికి తిరుపతి ప్రాంత నేతల్లో రోజా మినహా మిగిలిన వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశంపై స్పందించలేదు.
జగన్ అంటే విపరీతమైన అభిమానం కలిగిన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారు కూడా ఈ వ్యవహారాన్ని టచ్ చేయలేదు. నాని మాత్రం రెచ్చిపోయి మోదీని టార్గెట్ చేయడం ద్వారా వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి అయోధ్య భూమిపూజలో మోదీ ముఖ్య అతిథిగా మాత్రమే పాల్గొన్నారు. అక్కడ దంపతులు చేయాల్సిన ప్రక్రియ అంతా సలీల్ సింఘాల్, ఆయన భార్య మధు సింఘాల్ పూర్తిచేశారు. విశ్వహిందూ పరిషత్ మాజీ నేత అశోక్ సింఘాల్ సోదరుడే సలీల్ సింఘాల్. అంటే.. హిందువుల సంప్రదాయం ప్రకారం దంపతులతోనే అయోధ్య భూమి ప్రక్రియ జరిగింది.
అయితే, చరిత్రాత్మకమైన ఈ కార్యక్రమానికి మోదీ హాజరు కావడంతో ఫోకస్ మొత్తం ఆయనపైనే ఉండటంతో సలీల్ సింఘాల్ దంపతులను ఎవరూ పట్టించుకోలేదు. ఇక యోగి తన భార్యతో వెళతాడా అంటూ నాని చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగి బ్రహ్మచర్యం గురించి తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని జగన్ భావిస్తుంటే.. నాని వంటి నేతలు అందుకు విరుద్ధంగా వ్యహరిస్తూ వైసీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారంటున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
551689 833412I surely didnt know that. Learnt 1 thing new these days! Thanks for that. 578347
571337 409075Real instructive and amazing anatomical structure of articles , now thats user pleasant (:. 680010
38394 827405I believe this web site has some truly great info for everybody : D. 917437
872143 213545An fascinating discussion could be worth comment. I feel you must write on this topic, it may possibly surely be a taboo topic but typically people are not enough to dicuss on such topics. To a higher. Cheers 5778
965472 636135Some truly interesting information , properly written and broadly speaking user pleasant. 293247