Switch to English

నానీ వ్యాఖ్యలతో వైసీపీకి డ్యామేజీ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

తిరుమల డిక్లరేషన్ వివాదం వైసీపీకి భారీగానే డ్యామేజీ చేసిందా? చంద్రబాబు అండ్ కో వ్యూహాత్మకంగా విసిరిన ట్రాప్ లో వైసీపీ పడిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వైసీపికి ఇబ్బందిగానే పరిణమించాయని అంటున్నారు. ఓవైపు కేంద్రంతో దోస్తీ వైసీపీకి అవసరం.. అదే సమయంలో వైసీపీ రాజ్యసభ బలం బీజేపీకి అవసరం. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలూ ఓ అండర్ స్టాండింగ్ తో ముందుకెళ్లాలనే ఆయా పార్టీల అధిష్టాన పెద్దలు భావిస్తారు.

నిజానికి బీజేపీకి వైసీపీ అవసరం కంటే వైసీపీకి బీజేపీ అండ అత్యవసరం. నిధులు రావాలన్నా.. కేసుల విషయంలో ప్రతికూలతలు రాకూడదన్నా కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు నడపాల్సిందే. అయితే, డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర బీజేపీ.. వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించినా, పెద్ద సమస్య లేదు. కానీ ఎప్పుడైతే మంత్రి నాని ఈ వ్యవహారంలోకి ఎంటరై తనదైన శైలిలో విరుచుకుపడ్డారో వ్యవహారం మొత్తం వేడెక్కింది. భజరంగ్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగిపోయారు.

పోని ఇక్కడితే వదిలేస్తే ఏదో ఒక విధంగా వైసీపీ డ్యామేజీని పూడ్చుకుని ఉండేది. కానీ నాని అకస్మాత్తుగా తిరుమలలో ప్రత్యక్షమై ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శలు చేశారు. అయోధ్య భూమి పూజకు మోదీ ఏ భార్యతో వెళ్లారని.. యోగి ఎవరిని తీసుకెళ్లారంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఇది వైసీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది.

నిజానికి జగన్ తిరుమల వెళ్లడం ఇదే తొలిసారి కాదు. అయినా, డిక్లరేషన్ వ్యవహారం ద్వారా వైసీపీని ఇరుకున పడేయడానికే చంద్రబాబు మంచి ఎత్తుగడ వేశారు. ఈ ట్రాప్ లో నాని సులభంగా పడిపోయారు. బాబంటే అసలే దుందుడుకుగా వ్యవహరించే నాని.. ఆవేశంలో ఏకంగా మోదీనే టార్గెట్ చేశారు. బాబు కోరుకుంది కూడా ఇదే. నిజానికి తిరుపతి ప్రాంత నేతల్లో రోజా మినహా మిగిలిన వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశంపై స్పందించలేదు.

జగన్ అంటే విపరీతమైన అభిమానం కలిగిన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారు కూడా ఈ వ్యవహారాన్ని టచ్ చేయలేదు. నాని మాత్రం రెచ్చిపోయి మోదీని టార్గెట్ చేయడం ద్వారా వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి అయోధ్య భూమిపూజలో మోదీ ముఖ్య అతిథిగా మాత్రమే పాల్గొన్నారు. అక్కడ దంపతులు చేయాల్సిన ప్రక్రియ అంతా సలీల్ సింఘాల్, ఆయన భార్య మధు సింఘాల్ పూర్తిచేశారు. విశ్వహిందూ పరిషత్ మాజీ నేత అశోక్ సింఘాల్ సోదరుడే సలీల్ సింఘాల్. అంటే.. హిందువుల సంప్రదాయం ప్రకారం దంపతులతోనే అయోధ్య భూమి ప్రక్రియ జరిగింది.

అయితే, చరిత్రాత్మకమైన ఈ కార్యక్రమానికి మోదీ హాజరు కావడంతో ఫోకస్ మొత్తం ఆయనపైనే ఉండటంతో సలీల్ సింఘాల్ దంపతులను ఎవరూ పట్టించుకోలేదు. ఇక యోగి తన భార్యతో వెళతాడా అంటూ నాని చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగి బ్రహ్మచర్యం గురించి తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని జగన్ భావిస్తుంటే.. నాని వంటి నేతలు అందుకు విరుద్ధంగా వ్యహరిస్తూ వైసీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారంటున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...