నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్స్టాపబుల్-2’ టాక్ షో తాజాగా నాలుగో ఎపిసోడ్ను స్ట్రీమింగ్ చేశారు. ఈ ఎపిసోడ్కు చీఫ్ గెస్టులుగా, ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ సురేశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే దివంగత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్ గురించి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో షోలో ఉన్నవారితో పాటు ఆడియెన్స్ కూడా అవాక్కయ్యారు.
కిరణ్ కుమార్ రెడ్డి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన తరువాత చీఫ్ విప్, ఆ తరువాత స్పీకర్ అయ్యానని తెలిపారు. అయితే ఆ రోజు వైయస్ఆర్తో పాటు తాను కూడా హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉందని.. కానీ అసెంబ్లీ ముగిసే సమయం కావడంతో, తాను వెళ్లలేకపోయానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలా తాను బతికున్నా కాబట్టే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన గుర్తుకు చేశారు. అయితే తాను బతికుండటం వల్లే ఏపీ రాష్ట్ర విభజన చూడాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
అయితే తన తండ్రి మరణించినప్పుడు ఎంత బాధపడ్డారో, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అంతే బాధపడ్డట్లుగా చెప్పుకొచ్చారు. తాను పుట్టిపెరిగింది హైదరాబాద్లోనే అని, ప్రస్తుతం తాను ఉంటుంది కూడా ఇక్కడే అని ఆయన తెలిపారు. అయితే జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు చర్చించడం అవసరం లేదని.. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఇక ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
837940 520886Hey, you used to write wonderful, but the last several posts have been kinda boring I miss your tremendous writings. Past few posts are just a bit bit out of track! come on! 370968
775956 539855I genuinely appreciate your piece of function, Excellent post. 757195
52431 59081Superb editorial! Would like took pleasure the certain following. Im hoping to learn to read a good deal much more of you. Theres no doubt which you possess tremendous awareness and even imagination. I happen to be really highly fascinated making use of this critical info. 216825