పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. శ్రీశ్రీ రాసిన ఈ వాక్యం చాలా పాపులర్. ప్రస్తుతం ఇదే వాక్యాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. బుధవారం నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే నాని పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్సార్ సీపీలో చేరితే తాను బీజేపీలో చేరినట్టే అంటూ సెటైర్ వేసినప్పటికీ, ఆయన పయనం మాత్రం బీజేపీ వైపే సాగుతోందని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన నిర్ణయం జరిగిన తర్వాతే నాని తన అసంతృప్తిని ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారని అంటున్నారు. వాస్తవానికి నాని అసంతృప్తి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలుపొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎలా ఉంటాయో ఆయన ప్రత్యక్షంగా చూశారు. జిల్లాలో దేవినేని ఉమకు పార్టీపరంగా ప్రాధాన్యత దక్కడం, తనను అంతగా పట్టించుకోకపోవడం వంటి అంశాలు ఆయనలో అసంతృప్తికి ఆజ్యం పోశాయి.
దీనికి తోడు విజయవాడ పార్టీ కార్యాలయం విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు నానిలో మరింత ఆగ్రహం కలిగించాయి. విజయవాడ పార్టీ ఆఫీసుగా తన భవనం ఉపయోగించుకోవాలని నాని కోరగా.. చంద్రబాబు అంగీకరించారు. అయితే, తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ కార్యాలయం గొల్లపూడికి మారిపోయింది. దేవినేని ఉమ జోక్యమే ఈ నిర్ణయానికి కారణమని నాని భావించారు. అనంతరం జరిగిన పార్లమెంటరీ పార్టీ పదవుల పంపకం కూడా నానికి మంట పుట్టించింది.
పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్, లోక్ సభలో టీడీపీ నేతగా రామ్మోహన్ నాయుడులను ఎంపిక చేసిన చంద్రబాబు.. నానికి విప్ పదవి ఇచ్చారు. దీనిపై అసంతృప్తి చెందిన కేశినేని నాని.. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. విప్ పదవి స్వీకరించే సమర్థత తనకు లేదని, ఆ పదవిని సమర్థులకే ఇవ్వండని, తాను విజయవాడ ఎంపీగానే ప్రజలకు సేవ చేస్తానని పేర్కొంటూ చేసిన పోస్ట్ కలకలం సృష్టించింది. వెంటనే ఎంపీ గల్లా జయదేవ్.. నాని నివాసానికి వెళ్లి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నానిని తన ఇంటికి పిలిపించుకుని గంటకు పైగా మాట్లాడారు.
ఈ సందర్భంగా నాని చాలా విషయాలు కుండ బద్దలుకొట్టినట్టుగా చెప్పినట్టు సమాచారం. దేవినేని ఉమ ఒంటెత్తు పోకడల వల్లే పార్టీకి జిల్లాలో ఈ దుస్థితి పట్టిందని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ విషయాలన్నింటినీ తాను చూస్తానని, అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్టు సమాచారం. అన్నీ మరచిపోయి విప్ పదవి స్వీకరించాలని కోరగా.. నాని మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. పార్టీ మారడంపై నిర్ణయం తీసుకున్నందునే నాని.. ఈ విధమైన చర్యలకు తెరతీశారని అంటున్నారు.
తాజాగా శ్రీశ్రీ వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో పోస్టు చేయడం ద్వారా తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారనే చర్చ జరుగుతోంది. ఎంపీగా రెండోసారి గెలిచిన తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడం వంటి పరిణామాలు ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే సంకేతాలు పంపుతున్నాయని అంటున్నారు. నాని ఈ ప్రచారాన్ని ఖండించినా.. త్వరలోనే బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అదే జరిగితే అసలే ఓటమి బాధతో ఉన్న చంద్రబాబుకు ఇది పెద్ద షాక్ అని చెప్పక తప్పదు.
23529 270942A really informationrmative post and lots of truly honest and forthright comments produced! This undoubtedly got me thinking a good deal about this problem so cheers a good deal for dropping! 556480
410516 830676Hi there, i just thought i would publish and now let you know your sites style is truly smudged within the K-Melon browser. Anyhow sustain inside the really good function. 231265