సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతుంది. 14 రీల్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మహేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఆ సమయంలో కీర్తి సురేష్ అభిమానులతో సోషల్ మీడియా ఛాట్ చేస్తూ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటించబోతున్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.
మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ ఓకే అయ్యింది అంటూ పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చాయి. స్వయంగా కీర్తి సురేష్ ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది కనుక హీరోయిన్ విషయంలో చర్చ ఆగిపోయింది. మహేష్ బాబు కీర్తి సురేష్ల కాంబో ఎలా ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఈ సమయంలోనే చిత్ర టీం ఇంకా హీరోయిన్ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటోంది. షూటింగ్ మొదలవడానికి ఇంకా టైం పడుతుందని, కావున హీరోయిన్ ఎవరు అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీం అంటోంది.
కీర్తి సురేష్ ను ఈ చిత్రం కోసం సంప్రదించి ఉంటారు తప్ప ఆమెను ఇంకా ఫైనల్ చేయలేదేమో. తనను సంప్రదించడంతో మహేష్ బాబు సినిమా ఓకే అయ్యి ఉంటుందని కీర్తి సురేష్ అలా వ్యాఖ్య చేసి ఉంటుంది. మొత్తానికి సర్కారు వారి పాట చిత్రంలోని హీరోయిన్ ఎవరు అనే విషయమై మళ్లీ చర్చ మొదలైంది. షూటింగ్ ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించే అవకాశం ఉంది.
ఆ సమయంలో హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ను ఒక ఛాయిస్ గా భావించిన మేకర్స్ కు నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఆమెను పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్స్ సాయి మంజ్రేకర్ ను ఇంకా కియారా అద్వానీని కూడా పరిశీలిస్తున్నారట.
757369 384027I believe other site owners should take this web site as an model, quite clean and superb user genial design and style . 130109
815115 938700As I site possessor I believe the content matter here is rattling wonderful , appreciate it for your efforts. You ought to keep it up forever! Finest of luck. 874542