మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ స్పీడ్ పెంచింది. అంతకు ముందు వరకు అడగా దడపా చిత్రాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ ఒకేసారి తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే ఈమె చేస్తున్న ప్రతి సినిమా కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే కావడం విశేషం. స్కిన్ షోకు కమర్షియల్ పాత్రకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియాను చేస్తోంది. ఆ సినిమా ఈ విపత్తు తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో నగేష్ కుకునూరు దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తోంది.
ఇటీవల కీర్తి సురేష్ తో నగేష్ కుకునూరు చేస్తున్న సినిమా చేతులు మారింది. నిర్మాణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల కారణంగా దిల్ రాజుకు బ్యాలన్స్ షూటింగ్ బాధ్యతలను అప్పగించినట్లుగా తెలుస్తోంది. కథ నచ్చడంతో పాటు కీర్తి సురేష్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ చిత్రంను దిల్ రాజు టేకోవర్ చేసేందుకు ముందుకు వచ్చాడు. దిల్ రాజు చేతిలోకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు కూడా మొదలు అయినట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రంకు నగేష్ కుకునూరు అనుకున్న టైటిల్ కాకుండా దిల్ రాజు ‘గుడ్ లక్ సఖీ’ అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఇటీవలే ఆ టైటిల్ ను కూడా రిజిస్ట్రర్ చేయించారట. కీర్తి సురేష్ ఈ చిత్రంలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దిల్ రాజు చేతిలో పడటంతో కీర్తి సురేష్ మరో హిట్ కొట్టడం ఖాయంగా అనిపిస్తుంది.
567046 648556I discovered your blog internet site internet website on the internet and appearance some of your early posts. Continue to maintain within the great operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far far more from you obtaining out at a later date! 428388
533149 612014Totally composed written content material , thanks for data . 184315