మహానటి సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ కీర్తి సురేష్. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఆ సినిమాతో విమర్శకుల ప్రశంశలు సైతం పొంది నిజంగా మహానటిగా మారింది. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలతో జోరుమీదుంది కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా సినిమాలో నటిస్తున్న కీర్తి మరోవైపు పెంగ్విన్ టైటిల్ తో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తుంది. ఇందులో కీర్తి ప్రెగ్నెంట్ గా కనిపిస్తుందట.
తాజగా కీర్తి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు తెలిపింది. ముఖ్యంగా ప్రేమ పెళ్లి గురించి ఘాటు కామెంట్స్ చేసింది. ప్రేమ పెళ్లిళ్లు అన్నవి ఈ రోజుల్లో సహజమే. మా ఆ ఇంట్లో ఇప్పటికే ప్రేమ వివాహాలు జరిగాయి. మా అమ్మ నాన్నలది కూడా ప్రేమ వివాహమే. ఈ మద్యే మా సిస్టర్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే నా విషయానికి వస్తే నేను ప్రేమ వివాహం చేసుకుంటానా లేదా అన్నది తెలియదు. ప్రేమించడం తప్పేమి కాదు. నాకు ప్రేమపై చాలా గౌరవం ఉంది. నాకు కాబోయే వాడు ఎలా ఉండాలో అన్న ఆలోచన లేదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంది అంటూ చెప్పింది.
అయితే కీర్తి ప్రేమ పెళ్లి గురించి చెప్పడం చూస్తుంటే .. ఈ అమ్మడు ప్రేమలో పడిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇంత సడన్ గా కీర్తి ఎందుకు ప్రేమ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కీర్తి లవ్ లో పడింది అనే టాక్ మాత్రం జోరుగా వినిపిస్తుంది మరి. అదే నిజమైతే .. ఈ అమ్మడిని ప్రేమలో పడేసిన .. ఆ వ్యక్తి ఎవరో చూడాలి !!
