మహానటి ఫేం కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళం మరియు బాలీవుడ్ లో కూడా బిజీ బిజీగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో మిస్ ఇండియాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ తమిళనాట స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. మహానటి చిత్రంతో పోల్చితే ఈ అమ్మడు ప్రస్తుతం చాలా బరువు తగ్గి సన్నగా కనిపిస్తుంది. కీర్తి సురేష్ బరువు తగ్గడంపై మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి.
తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయం గురించి తన కథనంలో కీర్తి సురేష్ సన్నగా అయ్యింది కేవలం స్కిన్ షో కోసమే అన్నారు. ఆమె రాబోయే సినిమాల్లో బికినీ షో కూడా ప్రేక్షకులు చూస్తారేమో అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తి సురేష్ ను ఇకపై కన్నుల విందుగా చూసే అవకాశం ప్రేక్షకులకు రాబోతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో ప్రేక్షకులు ఈ విషయమై చాలా ఆతృతను వ్యక్తం చేస్తున్నారు.
కీర్తి సురేష్ ఈ వార్తలపై వెంటనే స్పందించింది. తను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా బికినీతో నటించను అంటూ క్లారిటీ ఇచ్చింది. తాను బరువు తగ్గడంకు ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదని చెప్పింది. తనకు అవకాశాలు వచ్చినా రాకున్నా కూడా గ్లామర్ పాత్రలకు ఎప్పుడు ఓకే చెప్పనంటూ కూడా కుండబద్దలు కొట్టినట్లుగా ప్రకటించింది. కీర్తి సురేష్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నప్పటికి ఆమె దృడ సంకల్పంకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.