Switch to English

‘సర్కారు సాగు’ సమంజసమేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

తాను బతికున్నంత వరకు రైతుబంధు సాయం ఆగదని పలుమార్లు కుండ బద్దలు కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తాజాగా సాగుకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరు ఏది పడితే అది పండించే పద్ధతి పోవాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే పండించాలని స్పష్టంచేస్తున్నారు.

రైతులు ఏయే ప్రాంతాల్లో ఎంత మేర ఏ పంటలు పండించాలో ప్రభుత్వమే చెబుతుందని, ఈ ప్రకారమే రైతన్నలు నడుచుకోవాలని పేర్కొన్నారు. సర్కారు చెప్పిన పంటలు పండించిన రైతులకే రైతుబంధు సాయం అందుతుందని, వారి పంటలే మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ నియంత్రిత సాగుపై చర్చ మొదలైంది. ఇది కరెక్టా, కాదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇది మంచిదే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రైతులు ఇప్పటివరకు కొన్ని అంచనాలు, పరిస్థితుల ఆధారంగా పంటలు పండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఎక్కువ మంది ఒకే పంట పడించడం వల్ల మార్కెట్లోకి అది ఎక్కువ రావడంతో ధర తగ్గుతోంది. అదే సమయంలో మరికొన్ని పంటలు అవసరానికన్నా తక్కువ పండిస్తుండటంతో వాటి ధర పెరుగుతోంది. ఒక్కోసారి కిలో టమాటాకి రూపాయి కూడా ధర రాదు. అదే ఒక్కోసారి మాత్రం ఏకంగా రూ.50 పెట్టాల్సిన పరిస్థితి. ఉల్లి విషయంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, ఎవరు ఏ పంట పండించాలో నిర్ణయిస్తే.. ఎవరూ నష్టపోయే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇది అంత ఆషామాషీ కాదని.. దీనిని అమల్లోకి తెచ్చే ముందు పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తొలుత రాష్ట్ర ఆహార అవసరాలు ఏమిటి అనే విషయాన్ని పక్కాగా లెక్కించడంతోపాటు ఎగుమతులు, భవిష్యత్తు అవసరాలకు తగిన నిల్వలు ఉండేలా చూసుకుని ఆ మేరకు ఏయే పంటలు ఎంత పండించాలో నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అనంతరం ఆ మేరకు కార్యాచరణ రూపొందించుకుని, రైతులకు అవగాహన కల్పించి ముందుకు సాగాలి.

దీంతో ఏ పంట ఎంత అవసరమో అంతే పండించే వీలు కలుగుతుంది. తద్వారా ధరలు కూడా స్థిరంగా ఉంటాయి. అటు రైతులతోపాటు ఇటు ప్రభుత్వం, ప్రజలు కూడా నష్టపోయే అవకాశం ఉండదని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేసింది. రాష్ట్రంలో 77 శాతం మంది ఆహారం బియ్యమే అని తేల్చింది. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలం సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరి, మరో 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం విజయవంతమైతే మిగిలిన రాష్ట్రాలు ఇదే పద్ధతి అనుసరించే అవకాశం ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...