తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు లక్ష్మి నరసింహ స్వామి వారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాదాద్రి పునః ప్రారంభ సమయం వచ్చేసింది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వస్తున్న యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్వ దర్శణంను వచ్చే ఏడాది మార్చి 28న నుండి ప్రారంభించబోతున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి దేవాలయం ను భారీ ఎత్తున పునర్ నిర్మించేందుకు గాను ప్రణాళిక సిద్దం చేశారు. కేవలం రెండున్నర ఏళ్లలో ముగించాలనుకున్న ఆ పునర్ నిర్మాణం కాస్త అయిదు ఏళ్లు అదనంగా పట్టింది. రాబోయే వెయ్యి ఏళ్ల వరకు దేవాలయం ఎలాంటి ఇబ్బంది లేకుండా అద్బుతంగా ఉండేలా నిర్మించారు. సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో అద్బుతమైన ఈ కళాకండంను తీర్చి దిద్దడం జరిగింది. యాదాద్రి ఆలయంకు సంబంధించిన పనులు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ప్రారంభంకు సిద్దం అయ్యారు. ప్రధాని సహా ప్రముఖులను ఈ ప్రారంభోత్సవంకు ఆహ్వానిస్తున్నారు.