తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కేశవరావు, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చర్చలకు సంసిద్ధంగా వుండాలంటూ పిలుపునిచ్చారాయన. ఓ పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు తమంతట తాముగా డిస్మిస్ అయ్యారనీ, వారితో చర్చల ప్రసక్తే లేదని తేల్చేస్తే.. టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు మాత్రం చర్చలకు సిద్ధమవ్వాలని కార్మికులకు పిలుపునివ్వడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
తన మొండి వైఖరి కారణంగా పరిస్థితి చేజారుతోన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారనీ, అయితే ‘అహం’ కారణంగా, ఆయన తనంతట తానుగా ఆర్టీసీ కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించలేక.. మధ్యవర్తిగా కేకేని రంగంలోకి దించారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, చర్చలకు తాము సిద్ధంగా వున్నామనీ.. ప్రభుత్వం తన అహంకార ధోరణి వీడాల్సి వుందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
ఇదిలా వుంటే, ఆర్టీసీ విలీనం తప్ప.. మిగతా ఏ విషయమ్మీద అయినా చర్చించడానికి తాము సిద్ధమని టీఆర్ఎస్ నేతలు చెబుతుండడం గమనార్హం. ఆర్టీసీ విలీనంపై టీఆర్ఎస్ గతంలో ఎలాంటి హామీ ఇవ్వలేదన్నది టీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాట. మొత్తమ్మీద, కేశవరావు రంగ ప్రవేశంతో ఆర్టీసీ సమస్యకు పరిష్కారం కొద్ది రోజుల్లో దొరికే అవకాశం వున్నట్లు భావించాలేమో.
హుజూర్నగర్ ఎన్నికల ముందర ఆర్టీసీతో పంచాయితీ.. ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాల్ని ఇస్తుందన్నది కేసీఆర్ భావనగా కన్పిస్తోంది. నిజానికి, ఆ ‘సోయ’ కేసీఆర్కి వుంటే.. ఆర్టీసీ కార్మికుల సమస్యని ఇంత పెద్ద వివాదంగా ఆయన మార్చి వుండేవారే కాదు.! ఆర్టీసీ కార్మికులకు ముల్లు గుచ్చుకుంటే.. తాను పంటితో ఆ ముల్లు తీసేస్తానని గతంలో చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఆర్టీసీ గుండెల్లో ‘సెల్ఫ్ డిస్మిస్’ అంటూ గునపం గుచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
30521 959440Some genuinely good and useful information on this site , besides I feel the style contains fantastic functions. 701095