కాకినాడ సెజ్ భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్: హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,402FansLike
57,764FollowersFollow

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇవ్వాలన్న హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములను స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు లేకుండా రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలోని సుమారు 1,551 మంది రైతులకు పెద్ద ఊరట లభించనుంది. కాకినాడ సెజ్ రైతుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా చర్చించగా, ప్రభుత్వం వెంటనే స్పందించింది.

గత ప్రభుత్వ కాలంలో జీవో నెం.12 వచ్చినా, భూముల రిజిస్ట్రేషన్లు జరగక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూములు పేర్లపై లేకపోవడంతో రుణాలు, పథకాల లబ్ధి దక్కలేదు. ఈ విషయాన్ని ఇటీవల శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

రైతుల సమస్యపై పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆసక్తి చూపి, రెవెన్యూ శాఖను చొరవ చూపేలా చేశారు. చివరకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘చిరంజీవి దోశ “మల్లెపూవు”లా ఉంటుంది..’ జ్ఞాపకాలు పంచుకున్న నటి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే గుర్తొచ్చేది డ్యాన్స్, ఫైట్స్, కామెడీ. అయితే.. చిరంజీవి అంటే గుర్తొచ్చేవి మరొక విషయం ఆయన వేసే దోశ. ‘చిరంజీవి దోశ’గా ఆయనకు పేటెంట్ కూడా ఉంది. ఆయనకు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ...

దుబాయ్‌లో అలర్ట్ పరిస్థితి.. తెలుగు వారితో ఈటెల రాజేందర్ ఫోన్ సంభాషణ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న తెలుగు ప్రజలతో ఈటెల రాజేందర్ ఫోన్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. బాంబుల మోతలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష ఇబ్బందులు...

Daily Horoscope: సింహకు శుభవార్త – వృషభకు ఆర్థిక లాభం సూచనలు

మార్చి 2, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి చర్చలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త...

ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్

విశాఖపట్నం: చారిత్రక వారసత్వం కలిగిన Andhra Universityకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అధికారులకు ఆదేశించారు. విశాఖలో యూనివర్సిటీ శతాబ్ది...