నిర్భయ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. కధువా ఘటన దేశం సిగ్గుపడేలా చేసింది. దిశ ఘటనతో ఆడవారి రక్షణ మరోసారి ప్రశ్నార్ధమైంది. ఇటువంటి ఘెరాలను అరికట్టడానికి.. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి. అయినా.. ఇటువంటి దురాగతాలు జరుగుతూ సమాజంలో మహిళల ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చేస్తున్నాయి. రీసెంట్ గా తమిళనాడులో ఏడేళ్ల బాలికపై జరిగిన దారుణకాండే ఇందుకు ఉదాహరణ.
తమిళనాడులోని పుదుకొట్టైలో ఓ ఏడేళ్ల బాలిక జూన్ 30 సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించిన ఇద్దరు కామాంధులు ఆ బాలికను కిడ్నాప్ చేశారు. బాలికను ఊరి బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసి తమ పశువాంఛ తీర్చుకున్నారు. అనంతరం బాలిక గొంతు నులిమి చంపేసి అక్కడే ముళ్లపొదల్లో పడేశారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలిక కనిపించక పోవడంతో తల్లిదండ్రలు ఆరాత్రి గ్రామమంతా గాలించారు. జూలై 1న గ్రామానికి సమీపంలోని ముళ్లపొదల్లో బాలిక మృతదేహాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక బట్టలు చిరిగిపోయి.. గొంతు నులిమిన ఆనవాళ్లను బట్టి బాలికను రేప్ చేసి గొంతునులిమి చంపేశారని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. పోలీసుల దర్యాప్తులో ఈ దుశ్చర్యను ఇద్దరు యువకులు చేశారని గుర్తించారు. వారిలో 25ఏళ్ల యువకుడిని అదుపులోకీ తీసుకుని ప్రశ్నించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
42788 621378But a smiling visitor here to share the really like (:, btw wonderful pattern . 438402
779710 418630Hello! Fantastic post! Please when I could see a follow up! 789579
183057 733063I feel this site contains some extremely good information for everybody : D. 596833
58518 925283Where else may anybody get that kind of info in such an ideal method of writing? 260864