2024 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరేందుకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. సోషల్ మీడియాలో జనసేన పార్టీ తనకున్న బలాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో బిజీగా వుండడం వెనుక కారణం కూడా ఇదే కావొచ్చు.
ఓ వైపు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ప్రత్యక్ష పోరాటం చేస్తూనే, ఇంకో వైపు.. సోషల్ మీడియా వేదికగానూ అదికార పార్టీపై ఒత్తిడి పెంచుతోంది జనసేన. కాగా, సోషల్ మీడియాలో ఇప్పటికే బలంగా వున్న వైసీపీ, జనసేన యత్నాల్ని తిప్పికొట్టేందుకు తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
తాజాగా, జనసేన పార్టీ, ‘కోర్టుకు వేళాయెరా.. 60 లక్షలు ఖాళీ ఆయెరా..’ అంటూ ఓ వీడియో విడుదల చేసింది. విశాఖలో లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేనాని చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో అది. దీనికి జనసైనికులు అదనంగా ఓ వీడియో జోడించారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళి, జైలు నుంచి తిరిగొస్తున్న వీడియో అది.
గా, గత కొద్ది రోజులుగా ‘పావలా’ అనీ, ‘ప్యాకేజీస్టార్’ అనీ, రకరకాల హ్యాష్ట్యాగ్లతో పవన్కళ్యాణ్ని వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్న దరిమిలా, వాటికి మరింత ధీటైన ఎదురుదాడిని జనసేన పార్టీ చేస్తూ వస్తోంది సోషల్ మీడియా వేదికగా.
ఇదిలా వుంటే, ప్రతి శుక్రవారం కోర్టు యెదుట ప్రత్యక్షంగా విచారణకు హాజరయ్యే విషయమై వెసులుబాటు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం, న్యాయస్థానం ఆ పిటిషన్ని తిరస్కరించడం తెలిసిన విషయాలే. వెసులుబాటు పిటిషన్లో తన భద్రత ఖర్చుని వైఎస్ జగన్ ప్రస్తావించడం, ప్రత్యర్థుల చేతికి ‘విమర్శల కత్తి’ అందించినట్లవుతోంది.
'ప్రతీ శుక్రవారం కోర్టుకి వెళ్ళేవారిని #ManFriday అంటారు'#YSJagan #SuitcaseVijaySaiReddy pic.twitter.com/X5iAYadwBX
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2019
Both are powerful and the only real distinction you
will uncover involving the two is while in the background noise.
693434 930264Woh I like your blog posts, saved to fav! . 854738