‘కరోనా వైరస్ని సాధారణ జ్వరంతో పోల్చుతారా.? జ్వరం వస్తుంది, తగ్గిపోతుంది.. అంటూ కరోనా వైరస్ పట్ల చులకనగా మాట్లాడతారా.? ప్రభుత్వంలో వున్నవారు ఇలా మాట్లాడటం వల్లే.. రాష్ట్రంలో ఇప్పుడు ఇంతటి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.
‘కరోనా కష్ట కాలంలో ప్రభుత్వానికి మద్దతుగా వుండాలనుకున్నాం. రాజకీయ విమర్శలకు దూరంగా వున్నాం. కానీ, ప్రభుత్వం తరఫున రెచ్చగొట్టే చర్యలు ఎక్కువవుతున్నాయ్. ప్రజల తరఫున అండగా జనసైనికులు నిలబడాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి..’ అంటూ అనంతపురం జిల్లాకి చెందిన జనసైనికులు, జనసేన నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా జనసేన అధినేత పలు కీలక సూచనలు చేశారు.
‘కరోనా వైరస్కి సంబంధించి అతి క్లిష్టమైన పరిస్థితుల్లోకి అడుగు పెడుతున్నాం. గ్రీన్ జోన్లు ఆరెంజ్ జోన్లుగానూ, రెడ్ జోన్లుగానూ మారకుండా చూసుకోవాలి. కానీ, దురదృష్టం, ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడంలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వాస్తవ పరిస్థితుల్ని తెలియజేస్తోన్న అధికారుల్ని ప్రభుత్వం సరిగా పనిచేయనివ్వడంలేదు. వారిపై వేటు వేయడానికీ వెనుకాడ్డంలేదు. నిజాల్ని దాస్తే చాలా నష్టపోతాం..’ అని జనసేన అధినేత అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ – లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ రంగ కార్మికుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేనాని, తెరవెనుక ఇసుకాసురులు రెచ్చిపోతున్నారనీ, అధికార పార్టీ నేతలపైనే ‘ఇసుక దోపిడీ’ ఆరోపణలు వస్తున్నాయని విమర్శించారు. పటిష్టమైన చర్యలు తీసుకుని వుండకపోతే, తమ పరిస్థితి కర్నూలు, గుంటూరులా అయిపోతుందని తెలంగాణ మంత్రి అనడం, ఆంధ్రప్రదేశ్లో కరోనా పరిస్థితిని చెప్పకనే చెప్పిందని జనసేనాని వ్యాఖ్యానించారు.
362894 91462I dugg some of you post as I thought they were extremely beneficial invaluable 990801