జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,371FansLike
57,764FollowersFollow

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని జనసైనికులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సభలో పవన్ స్పీచ్ కోసం జనసైనికులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఐతే వారు అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ స్పీచ్ అదిరిపోయింది. ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. అంటూ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ డైలాగ్ ఏదైతే ఉందో నేటి స్పీచ్ లో కూడా ఆ డైలాగ్ తో మొదలు పెట్టారు జననేత పవన్ కళ్యాణ్.

స్పీచ్ లో భాగంగా ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకే వేశామని. మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం.. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని అన్నారు పవన్ కళ్యాణ్. 2019 లో మనం ఓడిపోయినప్పుడు కొందరు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు. జనసేన ఆడపడచులను అవమానించారు. న్యాయం అడిగిన ప్రజలు, మహిళలపై కేసులు పెట్టారు. నాలుగు దశాబ్దాల సుధీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైలుకి పంపించారు. తనని అణచివేయాలని కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ లు చేశారు.

ఐతే ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో.. ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్ లో అడుగు పెట్టామని అన్నారు పవన్ కళ్యాణ్. దేశమంతా కూడా మనవైపు చూసేలా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాం.. భయం లేదు కాబట్టే ఇంత దూరం వచ్చా.. గుండె ధైర్యమే కవచం అని పవన్ అన్నారు.

ఇదే క్రమంలో జనసేన జన్మస్థలం తెలంగాణ. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ అని అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. కరెంట్ షాక్ కొట్టి చావుబతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడని అన్నారు పవన్ కళ్యాణ్. భారతదేశానికి బహుభాషలే మంచిది.. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని అన్నారు పవన్ కళ్యాణ్.

సభకు వచ్చి సినిమాల గురించి మాట్లాడొద్దు.. ఎందుకంటే జనసైనికులంతా ప్రాణాలకు తెగించి వచ్చారు. 450 మంది జన సైనికులు సినిమాలు చూసి కాదు సిద్ధాంతాలను నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం సినిమాల గురించి మాట్లాడొద్దని అన్నారు పవన్ కళ్యాణ్.

తాను అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లు పార్టీని నడిపించా.. పార్టీ 11వ సంవత్సరం వాళ్లను 11 సీట్లకే పరిమితం చేశాం. తనకు సినిమాలు కేవలం రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉపకరణం మాత్రమే అని అన్నారు పవన్ కళ్యాణ్. ఖుషి సినిమా చూసి గద్దరన్న తనని ప్రోత్సహించారని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారని అన్నారు పవన్ కళ్యాణ్.

తనకు సగటు మధ్య తరగతి మనిషిగా జీవించాలనే కోరిక ఉండేది. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు ఇంట్లో తనని పెంచారని.. అలాంటిది నేను సినిమాలు చేస్తా.. రాజకీయాల్లోకి వస్తానని ఎవరు ఊహించలేదని అన్నారు పవన్ కళ్యాణ్. మా నాన్నకు నేను డిగ్రీ చేసి ఎస్.ఐ ని కావాలని ఉండేది.. బయటకు వెళ్తే ఏమవుతానో అని భయపడేవారని అన్నారు పవన్ కళ్యాణ్.

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ఎక్కువ చదివినవి

జగన్‌కు హిందుత్వంపై విశ్వాసం లేదు: సాధు పరిషత్ అధ్యక్షుడి విమర్శలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddyకు హిందు ధర్మంపై విశ్వాసం లేదని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాస నంద సరస్వతి ఆరోపించారు. శుక్రవారం నిర్వహించిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.. వివరాలివే

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల కానుంది. అయితే.. సినిమాకు మరో సంగీత...

అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశానికి బలం: నారా లోకేష్

ముంబయిలో జరిగిన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా - 2026’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశాన్ని బలంగా...

విరోష్ రిసెప్షన్‌కి ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం

ఇండియాలోనే అత్యంత క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్‌గా నిలిచిన విరోష్ వివాహ వేడుకలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈ నెల 4న సాయంత్రం విజయ్...

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ...